యంగ్ టైగర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. గతంలో బిగ్బాస్ ఫస్ట్ సీజన్కు హోస్ట్గా అదరగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి టీవీల్లో సందడి చేయనున్నాడు. ఓ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారం కాబోయే టాక్ షోలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే బిగ్బాస్ షోకే కనివినీ ఎరుగని రీతిలో రెమ్యునరేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్కి ఎంత తీసుకుంటాడన్నది హాట్ టాపిక్గా మారింది. Also Read: అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ టాక్ షోకి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదంట. ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించడంతో పాటు తానే నిర్మాతగా మారుతున్నాడట ఎన్టీఆర్. ఈ ప్రోగ్రామ్తో వచ్చే లాభమంతా తన అకౌంట్కే వెళ్తుంది కదా.. మళ్లీ రెమ్యునరేషన్ ఎందుకు అనుకున్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.ఇందులో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల మధ్య వచ్చే ఖాళీ సమయాన్ని టాక్ షోకి కేటాయించనున్నాడట తారక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37oIMpR
No comments:
Post a Comment