దిల్ రాజు బర్త్‌డే పార్టీలో కనిపించని నందమూరి హీరోలు.. కారణం ఇదేనా?

టాలీవుడ్ అగ్ర నిర్మాత శుక్రవారం(డిసెంబర్ 18) 50వ పడిలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఆయన సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్‌తో పాటు ప్రభాస్, మహేశ్‌బాబు, నాగచైతన్య, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్లు సమంత, పూజా హెగ్డే, నివేదా థామస్, రాశీఖన్నా తదితరులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలోనే అందరికీ తన భార్యను పరిచయం చేసాడు దిల్ రాజు. అంతా బాగానే ఉంది కానీ ఈ పార్టీలో నందమూరి హీరోలు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. Also Read: అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం , కళ్యాణ్‌రామ్‌కు ఆహ్వానం పంపిన దిల్ రాజు.. నందమూరి బాలకృష్ణను పార్టీకి ఆహ్వానించలేదట. ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు.. బాబాయిని పిలవని పార్టీకి తాము వెళ్లడం బాగోదని అనుకున్నారట. అందుకే నందమూరి హీరోలు ఈ పార్టీకి రాలేదట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంతో దిల్ రాజు, నందమూరి హీరోలకే తెలియాలి. దిల్ రాజు‌కు నందమూరి హీరోలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఎన్టీఆర్‌తో ‘బృందావనం’ సినిమా నిర్మించాడు దిల్ రాజు. అలాగే కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పటాస్’ సినిమాను ఆయనే కొన్నారు. ఈ పార్టీలో దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కూడా కనిపించలేదు. కానీ నందమూరి హీరోల గైర్హాజరుపై మాత్రం తీవ్రంగా చర్చ నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37xH1H1

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts