Nirbhaya Case: ఏడేళ్ల శని వదిలింది.. నిర్భయ నిందితుల ఉరిపై సెలబ్రిటీ ట్వీట్స్

నిర్భయ దోషుల పాపం పండింది.. ఏడేళ్లుగా ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటూ వస్తున్న వారి కుయుక్తులు చివరికి ఫలించలేదు. నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన నలుగురికి శుక్రవారం ఉదయం పారామిలటరీ బలగాల భద్రత మధ్య ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు. జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఇవాళ ఉదయం 5.30 గంటలకు జైలు నెంబర్ 3లో ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. తలారి పవన్ జల్లాద్ 17 మంది సిబ్బందితో కలిసి ఈ నలుగురికి ఉరి శిక్ష ప్రక్రియను పూర్తి చేశారు. కాగా.. 2012 నుండి ఇప్పటివరకూ నిర్భయ కేసులో నిందితులు ఉరి నుంచి తప్పించుకుంటూనే వస్తున్నారు. అయితే ఎట్టకేలకు శుక్రవారం ఉదయం నిర్భయ నిందితులను ఉరితీయడంతో తీహార్ జైలు వద్ద వందలాది మంది జనం గుమిగూడారు. అనేక నిరసనను పోరాటాల తరువాత దోషులకు ఉరిశిక్ష అమలు కానుండటంతో తీహార్ జైలు వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఎట్టకేలకు న్యాయమే గెలిచిందంటూ జైలు వద్ద నినాదాలు చేశారు వందలాది మంది జనం. వీరే కాకుండా సోషల్ మీడియా వేదికగా నిర్భయ దోషులకు శిక్షపడటంపై హర్షం వ్యక్తం చేస్తూ తమ ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటున్నారు. సామన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం నిర్భయ దోషుల ఉరిపై స్పందిస్తూ ఆలస్యం అయినా న్యాయం గెలిచిందని ట్వీట్లు చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు సుస్మితాసేన్, ప్రీతి జింటాలతో పాటు టాలీవుడ్ నిర్మాత పీవీపీ ట్విట్టర్‌లో తమ స్పందనను తెలియజేశారు. "ధర్మ సంస్థాపనాయ సంభావామి యుగే యుగే".ఏడేళ్ల శని వదిలింది. చరిత్రలో నిర్భయ, దిశ మళ్ళీ పునరావృతం కాకూడదు. జైహింద్’ అంటూ నిర్మాత పీవీపీ ట్వీట్ చేశారు. ‘ఎట్టకేలకు నిర్భయ కేసుకు ముగింపు పలికారు. ఈకేసులో తీర్పురావడం ఆలస్యం అయినా దోషులకు శిక్ష పడటం ఆనందానే ఉంది. నిర్భయ తల్లిదండ్రులకు శాంతి లభించింది’ అంటూ #Justicedelayed హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది ప్రీతీ జింటా. మరో ట్వీట్‌లో.. ‘వీళ్లను 2012లోనే ఉరితీసినట్లైయే మహిళలపై క్రైమ్ జరగకుండా ఉండేది. చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారిని అదుపులో ఉంచుకోవడం కంటే.. నివారించమే మార్గం. మహిళలకు న్యాయం చేయడంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి భారత ప్రభుత్వానికి ఇదే మంచి సమయం’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రీతి జింటా. ఇక మరో సీనియర్ నటి సుస్మిత సేన్ స్పందిస్తూ.. చివరిగా కొంత న్యాయం జరిగింది.. నిర్భయ తల్లి ఆశాదేవి ఇది చూస్తున్నారు.. ఆమె పోరాటానికి న్యాయం జరిగింది’ అంటూ ట్వీట్ చేశారు సుస్మిత సేన్. వీరితో పాటు అనేకమంది సెలబ్రిటీలు నిర్భయ దోషుల ఉరిపై తమ స్పందనలు తెలియజేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33wwIzr

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts