పింక్‌ తెలుగు రీమేక్‌.. బడ్జెట్‌కు రెండింతలు తీసుకుంటున్న పవన్‌

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా బాలీవుడ్‌ సూపర్‌ హిట్ సినిమా పింక్‌ రీమేక్‌తో పవన్‌ రీఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్‌ హీరోగా నటిస్తున్నాడని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కి్ల్స్‌లో వినిపిస్తోంది. పింక్‌ రీమేక్‌లో నటించేందుకు పవన్ భారీ పారితోషికం అందుకుంటున్నట్టుగా చాలా రోజలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు పవన్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా సినిమా బడ్జెట్‌కు సంబంధించిన వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. Also Read: పవన్‌ పేమెంట్‌ను పక్కన పెడితే పింక్ తెలుగు రీమేక్‌ను 25 కోట్ల లోపే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్‌. అంటే సినిమా బడ్జెట్‌ కంటే దాదాపు రెండింతలు పవన్‌ రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నాడన్న మాట. పవన్‌ చివరి సినిమా అజ్ఞాతవాసి ఈ సినిమా డిజాస్టర్‌ కావటంమే కాదు నిర్మాతలకు దారుణమైన నష్టాలను మిగిల్చింది. అయినా పవన్‌ రీ ఎంట్రీ సినిమాకు భారీ పేమెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. ఈ సినిమాను బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ బోనీ కపూర్‌తో కలిసి వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పింక్‌ రీమేక్‌తో పాటు పవన్‌ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ సినిమా చేయనున్నాడట. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌ దొంగగా నటించనున్నాడు. ముస్లిం ప్రభువుల పాలన నడుస్తున్న కాలం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. పవన్‌ కెరీర్‌ ఇప్పటి వరకు కాస్ట్యూమ్స్‌ డ్రామా చేయకపోవటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rslLAh

No comments:

Post a Comment