మోదీగారు బాధతో చెప్తున్నా.. ప్రధానిపై ఉపాసన సంచలన ట్వీట్

మెగాస్టార్‌ చిరంజీవి కొడలు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన చేసిన తాజా ట్వీట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వివాదాలకు దూరంగా ఉండే ఉపాసన తాజాగా దేశ ప్రధానిని ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు సినీ వర్గాలతో పాటు పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి గాంధీ ఆశయాల గురించి చర్చించారు ప్రధాని మోదీ. ఈ సందర్భగా సినిమాల ద్వారా మహాత్ముడి ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. Also Read: ఢిల్లీలోని లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి షారూఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా టెలివిజన్, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేదానికి మద్దతు తెలిపిన ఆమిర్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. Also Read: బాలీవుడ్ సెలబ్రిటీలను కలిసి విషయాన్ని మోదీ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే ఈ సంఘటనపై మెగా కోడలు ఉపాసన కొణిదెల స్పందించారు. ఇలాంటి కార్యక్రమానికి దక్షిణాది పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడిని కూడా ఆహ్వానించకపోవటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. `మోదీగారు.. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. అయితే కళాకారులతో జరిగిన సమావేశాన్ని కేవలం హిందీ నటీనటులకు మాత్రమే పరిమితం చేసి దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవటం బాధించింది` అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. Also Read: ఈ ట్వీట్‌కు సినీ అభిమానులతో పాటు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది. ఉత్తరాది వారిది సౌత్‌ జనాలంటే ఎప్పుడూ చిన్నచూపే అంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఏ వివాదంలోనూ కనిపించని ఉపాసన ఏకంగా ప్రధాని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయటంతో ఈ ట్వీట్‌ సంచలనంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BxAafP

No comments:

Post a Comment