సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వెండితెరపై కనిపించాలని ప్రతీ ఒక్కరూ కలలు కంటుంటారు. నటనే ప్రొఫెషన్గా ఎంచుకోవాలనుకున్నవారు అవకాశాల కోసం ఎంతో కష్టపడుతుంటారు. కొందరికి పెద్దగా కష్టపడకుండానే అవకాశాలు వచ్చేస్తుంటాయి. మరికొందరికి ఎన్ని ఆడిషన్లకు వెళ్లినా చేదు అనుభవాలే ఎదురవుతుంటాయి. అలాంటి అనుభవాలను ఎదుర్కొ్న్న హీరోల్లో బాలీవుడ్ నటుడు ఒకరు. గురుగ్రామ్లో పుట్టిన రాజ్కుమార్ రావు ఎన్నో కలలతో ముంబయికి వచ్చారు. ఆ సమయంలో చేతిలో డబ్బు ఉండేది కాదు. ఇంట్లో కూడా పరిస్థితి అంతంత మాత్రమే. అయితే రాజ్కుమార్కి కెరీర్ తొలినాళ్లలో పెద్దగా అవకాశాలు లేక చాలా ఇబ్బందులుపడ్డాడట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్ని ఆడిషన్లు ఇచ్చినా ఒక్క సినిమాలోనూ సెలక్ట్ చేసుకునేవారు కాదు. కనీసం ప్రకటనలకు కూడా ఎంపిక చేసుకునేవారు కాదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయన జీవితంపై ఆశలు వదులుకోలేదు. ఈరోజు కాకపోతే రేపు అవకాశం రాకపోదు అన్న చిన్న ఆశతో జీవిస్తూ వచ్చాడు. అలా దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రణ్’ అనే సినిమాతో రాజ్కుమార్ తన సినీ కెరీర్ను ప్రారంభించాడు. ఈ సినిమాకుగానూ ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ రూ.11 వేలు. డబ్బు సరిపోక బిస్కెట్లు నీటితోనే కడుపు నింపుకునేవారు. ఒకవేళ డబ్బు ఉన్నా బయట రెస్టారెంట్లకు వెళ్లి రోటీలు తినడానికే సరిపోయేవి. ఈ నేపథ్యంలో రాజ్కుమార్ రావుకు ‘లవ్ సెక్స్ ఔర్ దోఖా’, ‘రాగిని ఎంఎంఎస్’ సినిమాలు లక్ను తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో రాజ్కుమార్ రెమ్యునరేషన్ లక్షలకు పెరిగింది. ఆయన చేసింది చిన్న సినిమాలే అయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు రాబట్టేవి. కట్ చేస్తే ఇప్పుడు రాజ్కుమార్ రావులాంటి హీరో బాలీవుడ్లో ఉన్నందుకు ఇండస్ట్రీనే గర్వపడుతోంది. ఆయన కోసమే స్పెషల్గా కథలు రాస్తున్న దర్శకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం రాజ్కుమార్ ‘మేడ్ ఇన్ చైనా’, ‘తుర్రం ఖాన్’, ‘రూహీ అఫ్జా’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MBpd3u
No comments:
Post a Comment