పవన్ ఆలోచనలే వేరు..!



from indiaherald.com - RSS Feeds https://ift.tt/3jdN5YI

హవీష్ చాలా బిజీబిజీ..!



from indiaherald.com - RSS Feeds https://ift.tt/3mSgyd5

హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన మహిళా నేత.. షాకింగ్ రిప్లయ్

కన్నడ నటి సంయుక్త హెగ్డేపై దాడి ఘటన సద్దుమణిగిపోయింది. ఆమెపై పార్కులో దాడికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కవితా రెడ్డి హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పారు. దీనికి సంయుక్త సానుకూలంగా స్పందించి వివాదానికి ముగింపు పలికింది. కన్నడ, తమిళంతో పాటు తెలుగులో ‘కిరాక్ పార్టీ’లో సినిమాలో నటించిన సంయుక్త హెగ్దే శుక్రవారం బెంగళూరులోని ఓ పార్కుకి స్నేహితులతో కలిసి వెళ్లారు. అక్కడ స్పోర్ట్స్ డ్రెస్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఆమెతో మహిళ వాగ్వాదానికి దిగారు. అసభ్యకరంగా డ్రెస్ వేసుకుని పబ్లిక్‌ పార్కులోకి ఎలా వస్తావంటూ దూషణలకు దిగింది. ఆమెకు తోడు మరికొందరు మహిళలు తోడై సంయుక్తతో పాటు ఆమె ఫ్రెండ్స్‌పై దాడి చేశారు. Also Read: తనకు జరిగిన పరాభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంయుక్త వెల్లడించడంతో తీవ్ర కలకలం రేగింది. ‘మహిళలు ఏం ధరిస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కారణాలతో వారిని హింసించడం సమాజం ఆపాలి’ అని ఆమె పోస్ట్ చేశారు. అనంతరం దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన మహిళను కాంగ్రెస్ పార్టీకి చెందిన కవితా రెడ్డిగా గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో దిగొచ్చిన ఆమె సంయుక్తకు క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తాను అలా చేసి ఉండాల్సింది కాదని, తాను చేసిన పనికి సిగ్గు పడుతున్నానని అన్నారు. దీనిపై స్పందించిన సంయుక్త.. అన్నీ మరిచిపోయి ముందుకు సాగుదామని అన్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DL33tX

సూపర్‌స్టార్ అభిమానులకు బిగ్‌ న్యూస్.. షూటింగ్ షురూ చేసిన మహేశ్‌

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని సినీ పరిశ్రమ మొత్తం కొద్ది నెలలుగా మూతపడిన సంగతి తెలిసిందే. చిన్ని సినిమాలతో పాటు భారీ ప్రాజెక్టులు సైతం మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అయితే అన్‌‌లాక్ ప్రక్రియలో భాగంతో కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తుండటంతో సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల షూటింగులు కూడా తిరిగి ప్రారంభమై మళ్లీ సందడి నెలకొంది. ఈ క్రమంలోనే పెద్ద సార్లు కూడా షూటింగులకు హాజరవుతున్నారు. కింగ్ నాగార్జున ఇటీవలే బిగ్‌బాస్-4తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. Also Read: తాజాగా సూపర్‌స్టార్ సైతం ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి హిట్ సొంతం చేసుకున్న మహేశ్ కొద్దినెలలు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. దీంతో మే నెల వరకు ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోలేదు. పరశురామ్‌తో తీయబోయే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కూడా తర్వాతే అని చెప్పేశాడు. ఈలోగా లాక్‌డౌన్ ఏర్పడటంతో ఆయనకు మరింత రెస్ట్ దొరికింది. ఈ సమయంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. Also Read: తాజాగా మహేశ్‌బాబు ఓ షూటింగ్ నిమిత్తం మేకప్ వేసుకున్నారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు. అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న మహేష్ ఓ యాడ్ నిమిత్తం షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగే ఈ వాణిజ్య ప్రకటనకు సంబంధించి మహేశ్‌బాబు పాల్గొన్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. రెండుమూడు రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌లో కోవిడ్ నిబంధలన్నీ కచ్చితంగా పాటిస్తున్నారు. సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించడంతో పాటు ఆ ప్రాంతాన్ని మొత్తం శానిటైజేషన్ చేసినట్లు సమాచారం. మరోవైపు సినిమా షూటింగ్‌లో మాత్రం సూపర్‌స్టార్ ఎప్పుడు పాల్గొంటారన్నది సస్పెన్స్‌గా మారింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DNTaf2