ఓవర్సీస్‌లో ఫుల్లుగా డల్లయిన డార్లింగ్.. ‘స్పైడర్’ తరవాతే ‘సాహో’!

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి చాలా పెద్ద దన్నుగా మారింది ఓవర్సీస్ మార్కెట్. అక్కడ కూడా తెలుగు వాళ్ళ సంఖ్య పెరగడం, వాళ్ళలో ఎక్కువమందికి వీకెండ్ ఎంటర్టైన్మెంట్ డెస్టినీ సినిమానే కావడం, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మన సినిమాలు రిలీజ్ చేస్తుండడానికి పోటీపడుతుండడంతో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. స్టార్స్ సినిమాలు అయితే ఏకంగా ప్రీమియర్స్‌తోనే వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొడుతున్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్ ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో ప్రభాస్ నటించిన ‘సాహో’ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది అని అంతా అంచనా వేసారు. నాన్ సాహో రికార్డ్స్ అనే పేరు రావడం ఖాయమనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇండియన్ సినిమాకి వరల్డ్‌క్లాస్ రేంజ్‌లో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన ‘బాహుబలి’ టాప్‌ప్లేస్‌లోనే నిలిచింది. ప్రీమియర్స్‌తోనే 2.45 మిలియన్స్ కలెక్ట్ చేసిన ‘బాహుబలి-2’.. ‘సాహో’కి అందనంత ఎత్తులో నిలిచింది. ఓవర్‌సీస్‌ కలెక్షన్ రికార్డ్స్‌లో ‘సాహో’ కనీసం సెకండ్ ప్లేస్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అసలు వన్ మిలియన్ మార్క్‌నే టచ్ చెయ్యలేకపోయింది. ఆల్‌టైం లిస్ట్‌లో టాప్-6 ప్లేస్‌తో సరిపెట్టుకుంది ‘సాహో’. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్‌ల కాంబో‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఒకటిన్నర మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఆల్‌టైం టాప్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ‘బాహుబలి’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. Also Read: చివరికి మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకున్న ‘స్పైడర్’ సైతం ప్రీమియర్స్‌తోనే వన్ మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరింది. అయితే, ఆ తరువాత విపరీతమైన డ్రాప్‌తో భారీ నష్టాలు మిగిల్చింది. కానీ భారీ హైప్ ‌, ఆఫ్టర్ ‘బాహుబలి’ అనే స్ట్రాంగ్‌ట్యాగ్‌తో వచ్చిన సినిమా అయ్యుండి కూడా ‘సాహో’ కనీసం మిలియన్ డాలర్స్ కూడా కలెక్ట్ చెయ్యలేకపోవడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఓవర్‌సీస్‌లో తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్స్‌ కలుపుకుని కేవలం ఎనిమిదిన్నర లక్షల డాలర్స్‌కి కాస్త పైచిలుకు అమౌంట్ మాత్రమే కలెక్ట్ చేసింది ‘సాహో’. మరీ ఇంత పూర్‌గా పెర్ఫార్మ్ చెయ్యడానికి కారణం మాత్రం టికెట్ రేటు పెంచడమే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆ ప్రభావం ప్రీమియర్ కలెక్షన్స్‌పై భారీగా పడిందని అంటున్నారు. తెలుగు వెర్షన్‌కి కాస్త బాగానే అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. కానీ హిందీ, తమిళ్ వెర్షన్స్ చాలా తక్కువ అమౌంట్స్ కలెక్ట్ చేసాయి. ఇక డొమెస్టిక్ సర్క్యూట్స్‌లో వచ్చిన రెస్పాన్స్, రేటింగ్స్ ప్రభావం వల్ల ఓవర్సీస్‌లో చాలామంది టికెట్ క్యాన్సిలేషన్‌ని వాడుతున్నారు. సినిమాలో చెప్పినట్టు ఓవర్సీస్‌లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం సినిమాకి మంచి మౌత్ టాక్ స్ప్రెడ్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ వచ్చుంటే ఆ దూకుడు వేరేలా ఉండేది. ఇప్పడు లాభాలు అనే మాట పక్కనబెట్టి కొన్న అమౌంట్ రాబట్టుకోటానికి డిస్కౌంట్స్, వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లాంటివి ప్లాన్ చెయ్యాల్సి వస్తుంది. Also Read: మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో..?, మొదటి వారంలో ‘సాహో’ ఏ మేరకు పెట్టుబడి రికవర్ చేస్తుంది అనేది అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కి కాస్త ఆందోళన కలిగిస్తుంది అనే మాట మాత్రం నిజం. ఈ వీకెండ్‌లో అంచనాలకు మించి వసూళ్లు రాబడితేనే నష్టాల నుండి బయపటపడడం అనేది సాధ్యం అవుతుంది. మరి ‘సాహో’ ఫేట్ ఎలా ఉంది అనేది తెలియాలంటే ఈ వారాంతం వరకు వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZA75OJ

మంచువారి చిన్నమ్మాయి.. సెలబ్రేషన్స్ స్టార్ట్

తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచువారింట ఏ సంబరం జరిగినా అది ప్రత్యేకమే. మంచు విష్ణు, విరానికా దంపతులకు ఇటీవల నాలుగో సంతానంగా పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ పాపకు ఐరా విద్య అని నామకరణం చేశారు. తన మూడో కూతురు ఫొటోను ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పుడే పేరు కూడా వెల్లడించారు. అయితే, తాజాగా విష్ణు భార్య విరానికా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. మొత్తం నాలుగు ఫొటోలను విరానికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో తమ నలుగురు పిల్లలతో మంచు విష్ణు దంపతులు కనిపించారు. అలాగే నలుగురు తోబుట్టువులు కలిసి అందంగా ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్మరిత విన్నకోట తీశారు. కుటుంబ సభ్యులంతా వైట్, లైట్ పింక్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. ఐరా.. నాన్న భుజంపై హాయిగా నిద్రపోతోంది. అమ్మ హస్తాల్లో ఇమిడిపోయింది. అక్కల మధ్య హాయిగా బజ్జొని చూస్తోంది. Also Read: కాగా, విష్ణు దంపతులకు తొలి సంతానంగా కవల ఆడపిల్లలు వివియానా, అరియానా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అవ్రామ్‌ జన్మించాడు. దీంతో, మంచువారింట వారసుడు పుట్టేశాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ, విష్ణు దంపతులు మరోబిడ్డను కోరుకున్నారు. ఆగస్టు 9న మూడో ఆడబిడ్డకు విరానికా జన్మనిచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది విష్ణు ‘ఓటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZuMiNa

‘సాహో’ రెస్పాన్స్.. అక్కడ లీస్ట్ 4 స్టార్స్!!

ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ‘సాహో’ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా ఇమేజ్‌తో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటి?, రెస్పాన్స్ ఏంటి? అంటే మాత్రం ఒక్కో దగ్గర ఒక్కో రకమైన మాట వినిపిస్తుంది. ఇది చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. నేటివిటీ, లోకల్ లాంగ్వేజ్, డొమెస్టిక్ స్టార్డమ్ లాంటి ఫ్యాక్టర్స్ వల్ల సాధారణంగా ఇలాంటి టాక్ వస్తుంటుంది. కానీ ‘సాహో’ లాంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాకు ఒక్కో దగ్గర ఒక్కో రకమయిన టాక్ రావడం మాత్రం విచిత్రం. తెలుగు నుండి నేషనల్ హీరోగా ఎదిగాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్‌కి ఉండే ఫ్యాన్‌బేస్ వేరు. పైగా ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ వల్ల అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ప్రభాస్ సినిమాపై సాఫ్ట్ కార్నర్‌తో ఉంటారు. అందుకే అతని సినిమా మరీ బాగాలేకపోతే తప్ప ఫ్లాప్ అనే మాట అంత తొందరగా స్ప్రెడ్ కాదు. అయితే ‘సాహో’కి మాత్రం తెలుగు‌ స్టేట్స్‌లో మొదటి రెండు ఆటలకు టాక్ ఒక మోస్తరుగా ఉంది అనే వచ్చింది. సినిమా మరీ తీసికట్టుగా ఉంది అనే మాట ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కానీ సాయంత్రం నుండి జనరల్ ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్లడంతో టాక్‌లో చాలా తేడా కనిపించింది. Also Read: సెకండ్ హాఫ్‌లో ఉన్న కన్ఫ్యూషన్‌తో ఎవరికి వాళ్ళు సినిమా ఏమీ అర్థం కాలేదు అనే రిపోర్ట్ ఇచ్చారు. దాంతో అప్పటివరకు ఉన్న ఒక మోస్తరు సినిమా అనే టాక్ కూడా వీకైపోయింది. అయితే, ఈ సినిమాకి పంజాబ్‌లో మాత్రం ఊహించని టాక్ వచ్చింది. అక్కడ వాళ్ళు బాలీవుడ్ తప్ప మిగతా లోకల్ లాంగ్వేజ్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు. కానీ, ‘బాహుబలి’ లాంటి ఎపిక్ సినిమాలో హీరో అయిన ప్రభాస్ నటించిన మూవీ కావడంతో పంజాబ్‌లో సైతం హౌస్‌ఫుల్స్‌తో ‘సాహో’ తన రన్ మొదలుపెట్టింది. విచిత్రంగా పంజాబ్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకి కూడా ‘సాహో’ బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమా సూపర్ అనేస్తున్నారు. రేటింగ్ ఎంత అంటే 5 స్టార్స్ అంటున్నారు. అక్కడ ‘సాహో’కి వచ్చిన లీస్ట్ రేటింగ్ 4 ‌‌స్టార్స్. అక్కడివాళ్లకు ఈ సినిమా ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యింది అంటే వాళ్ళు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు అనే మాట తప్ప వేరే కారణం కనిపించట్లేదు. ఇక తెలుగు సినిమాల హవా‌ని పెద్దగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్న బాలీవుడ్‌కి ‘సాహో’‌లో ఉన్న లోపాలు ఆయుధాలుగా మారాయి. దాంతో అక్కడి క్రిటిక్స్ అంతా ‘సాహో’ని చీల్చి చెండాడారు. ఆ ఎఫెక్ట్ బాలీవుడ్ వెర్షన్ కలెక్షన్స్‌పై కొంతవరకు ప్రభావం చూపించింది. దాంతో అక్కడ టాక్ కూడా పూర్తిగా నెగెటివ్‌గా స్ప్రెడ్ అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PvJZFb

ఈ డ్రెస్‌లో వాణీ కపూర్ మతిపోగొట్టేస్తుందట

హీరోయిన్ అనగానే ముందుగా మనల్ని ఆకర్షించేది ఆమె ఫిగర్ ఆ తర్వాత దుస్తులు. ఈ విషయంలో మన భారతీయ నటీమణలు హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోరు. ఇక వర్కవుట్స్ చేసే నటీమణుల ఫిగర్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సెక్సీగా కనిపిస్తారు. ఇప్పుడు నటి గౌను ఒకటి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘వార్’ సినిమాలో వాణి బ్లూ కలర్ గౌను ధరించే సన్నివేశం ఒకటి ఉంది. దానిని ఎలెక్టిక్ ఎల్లీ సాబ్ గౌను అంటారు. లెబనీస్‌కు చెందిన ఎల్లీ సాబ్ అనే ఐకానిక్ ఫ్యాషన్ డిజైనర్‌ ఈ గౌనును డిజైన్ చేశారు. ఈమె హాలీవుడ్ సెలెబ్రిటీస్ బియాన్సే, కేట్ మిడిల్టన్, నికోల్ కిడ్మన్, ఏంజిలినా జోలీ, ఎమీలియా క్లార్క్, కెండల్ జెన్నర్, టేలర్ స్విఫ్ట్‌లకు ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్‌నే బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్.. వాణీ కపూర్ కోసం తెప్పించారు. సినిమాలో ఈ గౌను ధరించే సన్నివేశం వాణీ కపూర్ ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయమని అనైతా అంటున్నారు. ‘సినిమాలో వాణీ ఎల్లీ సాబ్ గౌను వేసుకుంటారు. ఆమెను సినిమాలో వీలైనంత సెక్సీగా చూపించాను. ఇందులో ఫ్యాషన్‌కు ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి పాత్రలో వాణి కనిపించనున్నారు. ఆమెను విభిన్న అవతారాల్లో చూస్తాం. ఆమె కోసం నేను చాలా మిక్సింగ్, మ్యాచింగ్ చేసి దుస్తులను ఎంపిక చేశాను’ అని తెలిపారు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘వార్’ సినిమాను రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో గాంధీ జయంతి సందర్భంగా ఆగస్ట్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32rd3zl

హీరోయిన్స్ ఆ పని చెయ్యకతప్పదా..?

కథానాయిక.. సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు. కానీ వీళ్ళలో ఎక్కువమంది కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వాళ్ళు తమ పెర్సనల్‌ లైఫ్‌ని కూడా బాలన్స్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో నుండి తమకి నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుని చేస్తున్నారు. అందరికి ఆ అవకాశం ఉండదు. Also Read: పూజా హెగ్డే ముందు ‘ముకుంద’, ‘ఓ లైలా కోసం’ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేసింది. కానీ ఆమెకి అప్పుడు గుర్తింపు రాలేదు, అవకాశాలు రాలేదు. కానీ ‘DJ’ సినిమాలో బికినీ వేసి మరీ మొహమాటపడకుండా అందాల ప్రదర్శన చెయ్యడంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా అగ్రహీరోల సరసన వరుసగా నటించింది. ఇక ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న రష్మిక కూడా ముందు ‘ఛలో’ సినిమాలో డీసెంట్‌గా కనిపించింది. కానీ, అప్పుడు ఆమె ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ‌తో రెండు ఘాటు లిప్ లాక్స్ చేసేసరికి మాత్రం అంతా ఆమెపై ఫోకస్ చేసారు. ఇప్పడు బన్నీ, మహేష్ సినిమాల్లో ఆమె హీరోయిన్. చివరికి ‘బాహుబలి’లో తమన్నా, ‘సాహో’లో శ్రద్ధా కపూర్.. సినిమా ఏదయినా, హీరోయిన్ ఎవరయినా కూడా అందాల విందు చేస్తేనే ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ‘RX 100’ సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో పాయల్ రాజపుత్ హీరోతో కలిసి పండించిన రొమాన్స్ అనేది ఒప్పుకుని తీరాలి. అయితే ఆ సినిమా తరువాత ఆమెకు మళ్ళీ అదే తరహా సినిమాలు, అదే తరహా రోల్స్ వచ్చాయి. చాలా కాలం వాటికి వద్దనుకుంటూ వచ్చిన ఆమె మళ్ళీ అదే తరహా రోల్ చెయ్యకతప్పలేదు. ‘RX 100’లోనే ఆమె ఎక్స్‌పోజింగ్ హద్దులు దాటింది అనుకుంటే.. ఇప్పడు చేస్తున్న ‘RDX లవ్’ అయితే బూతుకు మారుపేరులా ఉంది. బోల్డ్ అనేపదానికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చి మరీ హీరోయిన్స్‌తో యథేచ్ఛగా బూతులు మాట్లాడించే కల్చర్ కూడా ఎక్కువైపోతోంది. కేవలం పాయల్ మాత్రమే కాదు రకుల్ ప్రీత్ సింగ్ ‘మన్మథుడు-2’లో చేసిన యాక్ట్స్ చూసాక చాలామందికి నోటమాట రాలేదు. మెహ్రీన్ కూడా నటన కంటే ఎక్కువగా స్కిన్ షోని నమ్ముకునే బండి నడిపిస్తుంది. స్కిన్ షోని నమ్ముకుని ముందుకు వెళ్లిన హెబ్బా పటేల్, రాశీ ఖన్నా, రెజీనా లాంటి వాళ్లకు సినిమాలు వచ్చాయి. కానీ కెరీర్ గ్రాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇక కెరీర్ ఎండ్‌కి వచ్చింది అని గుర్తించిన కాజల్ కూడా ఈ మధ్య ఎలాంటి సీన్స్ చెయ్యడానికి అయినా అభ్యంతరం చెప్పడం లేదు. ఆమె నటించిన ‘క్వీన్’ తమిళ్ రీమేక్ ‘పారిస్‌ పారిస్’లో సీన్స్ అయితే సెన్సార్ కత్తెరకి బలైపోయాయి. కానీ, అవి కట్ చేసినందుకు కాజల్ ఫీల్ అవ్వడం అసలు హైలైట్. ‘మహానటి’, ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’, ‘కర్తవ్యం’ లాంటి సినిమాలు వేళ్ళమీద లెక్కేయ్యవచ్చు. కానీ హీరోయిన్స్ అందాలని, వాళ్ళ బోల్డ్ సీన్స్‌ని నమ్ముకుని తెరకెక్కే సినిమాలు మాత్రం బోలెడన్ని వచ్చాయి, వస్తున్నాయి. హీరోయిన్ అంటే ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి అనేది తప్పనిసరిగా మారింది. ఈ ట్రెండ్‌కి ఇప్పట్లో బ్రేక్స్ పడే అవకాశం అయితే లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HygThJ

సమంత వేసుకున్న పొట్టి డ్రెస్ అంత ఖరీదా..!

అక్కినేని వారి కోడలు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌లోని ఇబిజా ఐల్యాండ్స్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. తన మావయ్య కింగ్ నాగార్జున బర్త్‌డే నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఇబిజా కాల్మాలో నాగార్జున పుట్టినరోజు వేడుక జరిగింది. భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంతలతో కలిసి నాగార్జున తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే, మావయ్య పుట్టినరోజు వేడుకలో సమంత వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున బర్త్‌డే పార్టీలో సమంత పింక్ కలర్ వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్‌ వేసుకున్నారు. ఈ పొట్టి డ్రెస్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వచ్చింది. అయితే, సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలని అంటున్నారు. అందుకే ఈ డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ ఫొటోను కూడా షేర్ చేసినప్పటికీ తన ఫొటో మాత్రం బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే, తన మావయ్య నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా సమంత ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టులో నాగార్జున ఫొటోను పొందుపరిచారు. ఈ ఫొటోలో నాగార్జున స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి తన శరీర సౌష్టవాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా, సామ్‌ ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో శర్వానంద్‌ హీరో. దిల్‌రాజు నిర్మాత. ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్‌లో కూడా సమంత నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZC0Fyz

Vidya balan: నా భర్తను డబ్బులు అడగలేను.. అందుకే..

ఇప్పటివరకు బాలీవుడ్ నటి ఎందరో దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేశారు. ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ కూడా పేరున్న నిర్మాతే. కానీ ఆయన నిర్మాణంలో ఇప్పటివరకు విద్య ఒక్క సినిమాలో కూడా నటించింది లేదు. అలా ఎందుకు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘ఎందుకంటే.. అది టూ మచ్ అయిపోతుంది. నేను నటిస్తున్న సినిమా దర్శకుడు, నిర్మాతతో ఏవన్నా సమస్యలు వస్తే వారితో నేను వాదిస్తాను. గొడవపెట్టుకోను కానీ నా వాదనలో న్యాయం ఉంటుంది. ఒకవేళ నా భర్త నిర్మాణంలో పనిచేయాల్సి వస్తే ఆయనతో ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు గొడవ పడుతూనే ఉంటాను. మా వివాహబంధంలో ఎలాంటి సమస్యలు రాకూడదన్నది నా అభిప్రాయం. మేం ఇద్దరం చాలా స్క్రిప్ట్స్ చేయాలని అనుకున్నాం. కానీ పారితోషికం విషయంలో మాత్రం ఆయనతో గొడవపడలేను. నా భర్తగా కాకుండా ఓ నిర్మాతగా.. విద్య నీకు ఇంతే పారితోషికం ఇస్తానని ఆయన అన్నప్పుడు.. కాదు నాకు ఎక్కువ కావాలని అడుగుతాను. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మాటా మాటా పెరిగి గొడవకు దారితీస్తుంది. అలాంటి సంఘటనలు మా మధ్య జరగకూడదని అనుకుంటున్నాను’ అని వెల్లడించారు విద్య. ఇటీవల విడుదలైన ‘మిషన్ మంగళ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విద్య. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం విద్య హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన గణితవేత్తగా శకుంతలా దేవి బయోపిక్‌లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MNidBY

సమంత లాస్ట్ సినిమా ఇదేనా

తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసుకుని పిల్లల కోసం రెండేళ్ల పాటు విరామం తీసుకోవాలనుకుంటున్నారట అగ్ర కథానాయిక . ప్రస్తుతం తన కుటుంబంతో కలిస స్పెయిన్‌లో విహరిస్తున్న సమంత.. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తారు. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమా తర్వాత పిల్లల కోసం సమంత తన కెరీర్‌కు టెంపరరీగా ఫుల్‌స్టాప్ పెడతారట. అదీకాకుండా నాగార్జున, నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులన్నింటికీ సమాధానం కావాలంటే సమంత హైదరాబాద్‌కు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘96’ సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ul6GdH

KRK: Saaho to keep in Hollywood museum as sign of worst film

krk Saaho to keep in Hollywood museum as sign of worst filmAfter watching Prabhas and Shraddha Kapoor starrer Saaho, KRK aka Kamaal R Khan has shared his review of  Saaho on his Twitter. He said,”Saaho should be kept in the Hollywood’s museum as a sign of worst film ever made in the history of this world.” KRK also said about Saaho that it is wastage of Rs 400 Cr.

KRK tweeted: It’s interval n till here no action and no story in #Saaho! Only comedy and that also forced And Foohad comedy. It’s high voltage torture which will be enjoyed by single screen audience, Jo Kahenge “Yaar Khatarnak film Hai”! It’s a wastage of ₹400Cr to just fool uneducated ppl.

#Saaho is such a fantastic film that it should be kept in the Hollywood’s museum as a sign of worst film ever made in the history of this world. A challenge should be given to script writers around the world that whoever will understand it during next 100Yrs, will get ₹2000Cr.

I went through such a high voltage torture During 3 hours watching #Saaho, That I am not in the condition to record video review. But I will still do it for my fans and followers. But pls forgive me if you find me very dull, tired and exhausted.



from TOPSTORIES – Tollywood https://ift.tt/2HB4euq

KRK: Saaho to keep in Hollywood museum as sign of worst film

krk Saaho to keep in Hollywood museum as sign of worst filmAfter watching Prabhas and Shraddha Kapoor starrer Saaho, KRK aka Kamaal R Khan has shared his review of  Saaho on his Twitter. He said,”Saaho should be kept in the Hollywood’s museum as a sign of worst film ever made in the history of this world.” KRK also said about Saaho that it is wastage of Rs 400 Cr.

KRK tweeted: It’s interval n till here no action and no story in #Saaho! Only comedy and that also forced And Foohad comedy. It’s high voltage torture which will be enjoyed by single screen audience, Jo Kahenge “Yaar Khatarnak film Hai”! It’s a wastage of ₹400Cr to just fool uneducated ppl.

#Saaho is such a fantastic film that it should be kept in the Hollywood’s museum as a sign of worst film ever made in the history of this world. A challenge should be given to script writers around the world that whoever will understand it during next 100Yrs, will get ₹2000Cr.

I went through such a high voltage torture During 3 hours watching #Saaho, That I am not in the condition to record video review. But I will still do it for my fans and followers. But pls forgive me if you find me very dull, tired and exhausted.



from NEWS – Tollywood https://ift.tt/2HB4euq

సాహో కలెక్షన్లు ఎంత రాబట్టిందో తెలుసా..

సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాహో తొలిరోజు రూ.23 కోట్ల వసూళ్లు రాబట్టింది. ముంబయి బాక్సాఫీస్ వద్ద రూ.24 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. తమిళ వెర్షన్‌లో రూ.11 కోట్లు రాబట్టింది. మలయాళ వెర్షన్‌కు సంబంధించి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే సాహోపై నెగిటివ్ ప్రచారం జరిగితే మాత్రం రెండు వారాలు కూడా సినిమా థియేటర్‌లో నిలవదని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే దగ్గర బెడిసికొట్టిందని చాలా మంది అన్నారు. ముంబయి, గుజరాత్, మరాట్వాడా ప్రాంతాల్లో సాహోకు మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో రెండు వేల ప్రింట్స్ ఆలస్యంగా వచ్చాయి. బాహుబలి తర్వాత హిందీలో బెస్ట్ డబ్డ్ వెర్షన్‌గా నిలిచింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవానికే విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని వాయిదా వేశారు. సాహో విడుదలకు ముందు మిషన్ మంగళ్, బాట్లా హౌస్ సినిమాలు విడుదలయ్యాయి. ఆ ప్రభావం సాహో మీదే పడే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ug4UL8

Saaho: ప్రభాస్ దొంగ అంటున్న బాలీవుడ్ నటి

భారీ అంచనాల మధ్య సాహో సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుడ్, బ్యాడ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది. అయితే సినిమా విడుదలైన రోజే వివాదంలో పడింది. సినిమాలోని ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ అనే పాటలో బ్యాక్‌గ్రౌండ్‌లో డిజైన్ మీకు గుర్తుందా? ఆ డిజైన్‌ను షైలో శివ్ సులేమాన్ అనే ఆర్టిస్ట్ రూపొందించినదట. ఈ విషయాన్ని షైలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. తాను రూపొందించిన అసలు డిజైన్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ డిజైన్‌ను షైలో 2014లో రూపొందించారట. తన క్రియేటివిటీని దొంగిలించి కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. దీనిపై బాలీవుడ్ నటి లీసా రే స్పందిస్తూ.. ‘ఇలా ఒకరి పనితనాన్ని దొంగిలించేవారికి వ్యతిరేకంగా నిలబడి ఖండించాల్సిన సమయం వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. భారీ సినిమాను తెరకెక్కించిన ఓ నిర్మాణ సంస్థ ఒకరి ఆర్ట్ వర్క్‌ను దొంగిలించడం కరెక్ట్ కాదు. దీనిని దొంగతనం అంటారు. ప్రపంచంలో ఎక్కడా వీటిని సహించరు’ ‘ఆర్ట్ వర్క్‌ను ఉపయోగించడానికి ముందు (నిర్మాణ సంస్థ) ఒక్కసారి కూడా షైలో అనుమతి తీసుకోలేదు. కనీసం ఆమె పనితనాన్ని వాడుకున్నందుకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. క్రియేటర్లను అందరూ దైవంగా భావిస్తారు. వారి ప్రతిభను దొంగలించకూడదు. మీ ఇంట్లోకి ఒక దొంగ చొరబడి మీ విలువైన వస్తువులను దొంగిలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి’ అని పేర్కొన్నారు. ఈ విషయంపై సాహో చిత్రబృందం స్పందించాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zAuO2B

Jacqueline Fernandez: ‘సాహో’.. బ్యాడ్‌ బాయ్‌ భామ రూ. 2 కోట్లుకు న్యాయం చేసిందా?

థియేటర్స్‌లో ‘సాహో’ మేనియా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ థియేటర్స్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల కోలాహలంతో సందడిగా ఉంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా ఎలా ఉంది? ప్రభాస్ బాహుబలి రికార్డ్‌లను బ్రేక్ చేశాడా? సుజీత్ డైరెక్షన్ బాగుందా? యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? లాంటి చర్చలతో పాటు ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన శ్రీలంక సుందరి జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌‌పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘సాహో’ చిత్రంలో బాగా పాపులర్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే.. అది ఆమె ప్రభాస్‌తో ఆడిపాడిన బ్యాడ్ బాయ్ సాంగ్. ‘సాహో’ ప్రీ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. కాగా ఈ సాంగ్ కోసం ఈ భామ ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికంగా తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక్కసాంగ్‌కి రూ. 2 కోట్లా అంటూ చాలా మంది నోరెళ్లబెట్టారు. అయితే ఈ బ్యాడ్ బాయ్ సాంగ్‌ను వెండితెరపై చూసిన ప్రేక్షకులు అందచందాలకు ఫిదా అవుతున్నారు. తన అందచందాలతో అదరహో అనిపించింది జాక్వలిన్. తన ఒంపుసొంపుల వయ్యారాలతో మెలికలు తిరుగుతూ కనువిందు చేసింది. ప్రభాస్ పక్కన మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఆమెతో పాటు అందమైన మోడల్స్‌తో సాంగ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ పాటను బాలీవుడ్ కంపోజర్ బాద్‌షా స్వరపరిచారు. నీతి మోహన్‌తో కలిసి ఆయనే ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు. మొత్తానికి తీసుకుంటే తీసుకుంది కాని.. రూ. 2 కోట్లు వాటికి న్యాయం చేసిందనే అంటున్నారు సినీ అభిమానులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UmxHxG

Vishal: పెళ్లి ఆగిందా.. కాబోయే భార్య పోస్ట్ ఇది

విశాల్, అనీశాల వివాహం రద్దైందని చాలా కాలంగా వదంతులు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం అనీశా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా నుంచి డిలీట్ చేయడమే. పెళ్లి ఆగిపోయిందని ఎన్ని పుకార్లు వస్తున్నా వీరిద్దరూ స్పందించలేదు. అయితే విశాల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టారు అనీశా. ‘హ్యాపీ బర్త్‌డే స్టార్. నువ్వు స్టార్‌గా మెరవడానికే పుట్టావు. నీకు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. నాకు ఆ నమ్మకం ఉంది. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొంటూ విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే.. నడిగర్ సంఘానికి ఓ కార్యాలయం నిర్మించేంతవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అనీశాతో కూడా చర్చించానని ఇందుకు తాను కూడా ఒప్పుకుందని విశాల్ అన్నారు. అయితే ఇదే విషయంలో ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి పెళ్లిని రద్దు చేసుకున్నాయని కోలీవుడ్ వర్గాలు అన్నాయి. మొత్తానికి అనీశా ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది. వర్క్ పరంగా ప్రస్తుతం విశాల్ ‘యాక్షన్’ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా విశాల్‌కు జోడీగా నటిస్తున్నారు. ఆ తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరవాలన్ 2’ ‘ఇరుంబు థిరాయ్ 2’ చిత్రాల్లో నటిస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UeDhSu

Prabhas Saaho: ‘సాహో’ హైలైట్స్.. స్టేడియంలో సిక్స్ బాదాడా?

‘సాహో’.. ఫీల్ గుడ్ మూవీకి ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటివాడు. కంటెంట్ కరెక్ట్‌గా ఉన్నా.. విజువల్ చాలా డిస్ట్రబింగ్‌గా ఉంటుంది అంటూ ట్రైలర్‌తో ఆసక్తిరేపి ప్రేక్షకుల్ని థియేటర్స్ వైపుకు తీసుకురాగలిగారు. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ఇంటర్నేషనల్ స్టార్‌గా మారారు . దీంతో ఆయన చిత్రాలకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టే ‘రన్ రజా రన్’ ఫేమ్ సుజీత్ ‘సాహో’ అనే భారీ ప్రాజెక్ట్‌కు మూవీని రూపొందించారు. యూవీ క్రియేషన్స్‌లో సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గురువారం అర్ధరాత్రి నుండి పలుచోట్ల ‘సాహో’ మూవీ ప్రదర్శితం కావడంతో సోషల్ మీడియాలో ‘సాహో’ మేనియా నడుస్తోంది. Read Also: ‘సాహో’ మూవీ హైలైట్స్.. ✦ అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి పాత్రలో ప్రభాస్‌ ✦ క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ పాత్రలో శ్రద్ధ కపూర్‌ ✦ గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథను అల్లిన దర్శకుడు సుజీత్. ✦ హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు. ✦ ఛేజింగ్స్ సీన్స్, చివరి ఇరవై నిమిషాల యాక్షన్ పార్ట్ హైలైట్ ✦ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్. ✦ క్లైమాక్స్ ట్విస్ట్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ✦ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ‘బ్యాడ్‌ బాయ్‌...’ సాంగ్ అదనపు ఆకర్షణ ✦ ప్రభాస్ రియల్ క్యారెక్టర్ బయటపడే ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ ✦ క్లైమాక్స్‌లో హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ ✦ కుదిరిన ప్రభాస్, శ్రద్ధా జోడీ.. లవ్ ట్రాక్ ఇంట్రస్టింగ్ ✦ వినోదానికి దూరంగా ‘సాహో’.. కామెడీ లేకపోవడం మైనస్ ✦ గ్రిప్పింగ్ తప్పిన స్క్రీన్ ప్లే.. ✦ ఆకట్టుకోలేకపోయిన సాంగ్స్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zy6deE

‘సాహో’ మూవీ రివ్యూ

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలతో పాటు అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2ZBR8Ym

‘సాహో’ మూవీ రివ్యూ

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలతో పాటు అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2ZBR8Ym

‘సాహో’ మూవీ రివ్యూ

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలతో పాటు అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2ZBR8Ym

‘సాహో’ మూవీ రివ్యూ

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలతో పాటు అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://telugu.samayam.com/telugu-movies/movie-review/​prabhas-shraddha-kapoor-starrer-saaho-telugu-movie-review-rating​/moviereview/70902217.cms

‘సాహో’ మూవీ రివ్యూ

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలతో పాటు అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://telugu.samayam.com/telugu-movies/movie-review/​prabhas-shraddha-kapoor-starrer-saaho-telugu-movie-review-rating​/moviereview/70902217.cms

‘సాహో’ మూవీ రివ్యూ

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలతో పాటు అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://telugu.samayam.com/telugu-movies/movie-review/​prabhas-shraddha-kapoor-starrer-saaho-telugu-movie-review-rating​/moviereview/70902217.cms

‘సాహో’ ట్విట్టర్ రివ్యూ.. భయపెడుతోన్న ఆడియన్స్ టాక్!

బహుశా ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు ఈ స్థాయిలో హైప్ రాలేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకే పరిమితం. కొన్ని సినిమాలు దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. కానీ, ‘బాహుబలి’ తెలుగు సినిమా గమనాన్ని మార్చింది. పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ‘బాహుబలి’ సిరీస్ ద్వారా ప్రభాస్‌ నేషనల్ హీరో అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. అందుకే, ‘సాహో’ మొదటి నుంచి వార్తల్లో నిలిచింది. విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. విపరీతమైన బజ్ ఏర్పడింది. Also Read: సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఆ ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే నిజంగా భయమేస్తోంది. పాజిటివ్ కామెంట్ల కన్నా.. నెగిటివ్ ఫీడ్‌బ్యాకే ఎక్కువగా వస్తోంది. ఈ సినిమాకు రూ.350 కోట్లు ఎందుకు పెట్టారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టేంతగా కథ, కథనాలు దీనిలో ఏమున్నాయని అడుగుతున్నారు. Also Read: అయితే, కొంత మంది మాత్రం సినిమా చాలా బాగుందని.. భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ మూవీ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. సినిమాను ప్రభాస్ తన భుజస్కందాలపై మోశాడని కొనియాడుతున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ అట. అయితే పాటలు, రొటీన్ స్టోరీ, రన్‌టైమ్, పూర్ వీఎఫ్ఎక్స్ సినిమాకు మైనస్ అంటున్నారు. మొత్తం మీద ‘సాహో’ మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZECLy9

స్పెయిన్‌లో నాగ్ బర్త్‌డే.. మావయ్య కోసం సమంత ప్రత్యేక ఏర్పాట్లు

టాలీవుడ్ మన్మథుడు, అభిమానుల కింగ్ అక్కినేని నాగార్జున నేడు (ఆగస్టు 29న) 60వ ఏట అడుగుపెట్టారు. అయితే, ఈ పుట్టినరోజు వేడుకను ఆయన అభిమానుల మధ్య జరుపుకోవడంలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య స్పెయిన్‌లో జరుపుకుంటున్నారు. సతీమణి అమలతో కలిసి బుధవారం ఉదయం నాగార్జున స్పెయిన్ వెళ్లారు. నాగార్జున కన్నా ముందుగానే ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్.. కోడలు సమంత, మరికొంతమంది కలిసి అక్కడికి వెళ్లారు. స్పెయిన్‌లోని ఇబిజా కాల్మాలో నాగ్ బర్త్‌డే వేడుక జరగనుంది. రెండు రోజుల క్రితమే నాగచైతన్య, సమంత, అఖిల్ ఇబిజా కాల్మా చేరుకున్నారు. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మావయ్య పుట్టినరోజు కోసం సమంత ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని తెలిసింది. సుమారు వారం రోజులపాటు నాగార్జున తన కుటుంబ సభ్యులతో స్పెయిన్‌లో విహరించనున్నారు. సెప్టెంబర్ 6న నాగార్జున దంపతులు ఇండియాకు తిరిగొస్తారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. Also Read: కాగా, నాగార్జున ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ 3 హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘బిగ్ బాస్’ షోలో ప్రతి శని, ఆదివారాల్లో నాగార్జున కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు రోజులు హౌస్‌మేట్స్‌తో నాగార్జున మన టీవీ ద్వారా మాట్లాడతారు. అయితే, రాబోయే రెండు వారాలకు నాగార్జున తన షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారట. స్పెయిన్ నుంచి రాగానే నేరుగా ‘బిగ్ బాస్’ షూటింగ్‌లో నాగార్జున పాల్గొంటారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PlEhWm

60 ఏళ్ల మన్మథుడు.. హ్యాపీ బర్త్‌డే కింగ్

నాగార్జున క్లాస్ హీరో!.. ఎవరన్నారా మాట?.. ‘గీతాంజలి’ చూసినోళ్లు!.. వారెవరూ ‘హలోబ్రదర్’ చూడలేదా?.. ఐతే నాగ్ మంచి కామెడీ హీరో!.. ‘మాస్’ చూడలేదా?.. సరే నాగ్ మాస్ హీరో!.. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ బాధ పడతారేమో?.. ఐతే నాగ్ క్లాసికల్ హీరో!.. అట్టాకాదు గాని ఇంకో మాట చెప్పు!.. నాగ్ ‘ఆల్ రౌండర్’..! అంతేగా, అంతేగా. కింగ్ ఒక జోనర్‌కు పరిమితం చేయలేం. ఎందుకంటే ఆయన చేయని జోనర్ లేదు. మాస్, క్లాస్, డివోషనల్, రొమాన్స్, యాక్షన్, సోషల్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్, పాట్రాయిటిక్.. వీటిలో నాగ్ టచ్ చేయని జోనర్ లేదు. రికార్డులు, కలెక్షన్లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నాగార్జున. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు. అక్కినేని సామ్రాజ్యాన్ని విస్తరించారు. టాలీవుడ్‌కి ఉన్న మూడు మూలస్తంభాల్లో ఒకటిగా నిలిచారు. ఇప్పటికీ 30 ఏళ్లు దాటిన మన్మథుడిలా కనిపిస్తోన్న నాగార్జున 60వ ఏట అడుగుపెట్టారు. నేడు (ఆగస్టు 29న) తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమ హీరో పుట్టినరోజు వేడుకలను అక్కినేని అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరపడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ట్విట్టర్‌లో #HBDKingNagarjuna హ్యాష్‌ట్యాగ్‌తో నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు కింగ్‌ను ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్లు చేస్తున్నారు. Also Read:

‘విక్రమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగార్జున.. ‘మజ్ను’, ‘గీతాంజలి’ సినిమాలతో లవర్ బోయ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆ తరవాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో నాగ్ అసలు సిసలు మాస్ హీరో‌గా మారారు. ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇక ఆ తరవాత నాగార్జున వెనుదిరిగి చూడలేదు. ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’, ‘నువ్వు వస్తావని’, ‘ఆజాద్’, ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘శివమణి’, ‘నేనున్నాను’, ‘మాస్’, ‘శ్రీరామదాసు’, ‘కింగ్’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’, ‘దేవదాస్’.. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు నాగార్జున. టాలీవుడ్‌లో ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన హీరో నాగార్జున అంటే అతిశయోక్తికాదు. నాగ్ చేసినన్ని ప్రయోగాలు ఏ హీరో చేయలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు 91 సినిమాల్లో నటించిన నాగార్జున సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. కుమారులు నాగచైతన్య, అఖిల్‌లకు గట్టిపోటీనిస్తున్నారు. ఇంకో విషయం.. తెలుగు సినీ పరిశ్రమలో నాగార్జున పరిచయం చేసిన దర్శకులే అత్యధికం. మొత్తం 39 మంది కొత్త దర్శకులను నాగార్జున పరిచయం చేశారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటారు నాగ్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. నాగార్జునను ఆదర్శంగా తీసుకొని ఆ తరవాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని టెలివిజన్ ప్లాట్‌ఫాంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం నాగ్ ‘బిగ్ బాస్’ షోను విజయవంతంగా నడిపిస్తు్న్నారు. ఎంత పెద్ద హీరో అయినా, ఎన్ని కోట్లకు అధిపతి అయినా నాగార్జున ఎప్పటికీ ఒదిగే ఉంటారు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. టాలీవుడ్ కింగ్, నిత్య మన్మథుడు అక్కినేని నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UbnV1e

నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ చూశారాా

‘కిల్ బిల్ అంటే రసీదును చంపు’.. ఇలాంటి ట్రూ ట్రాన్స్‌లేషన్‌ని ఎక్కడైనా చూశారా? ఇది నేచురల్ స్టార్ చేసిన ట్రాన్స్‌లేషన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో నాని పెన్సిల్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇంగ్లిష్ సినిమాలు చూసి వాటిలోని డైలాగాలను తెలుగులోకి ఫన్నీగా ట్రాన్స్‌లేట్ చేస్తుంటాడు. రివెంజ్ స్టోరీలు రాసే పాత్ర ఆయనది. ఈ నేపథ్యంలో ఓరోజు అనుకోకుండా నలుగురు మహిళలు, ఓ చిన్నారి నానిని వెతుక్కుంటూ వెళ్తారు. అతనితో కలిసి ఒక్కొక్కరిపై పగలు తీర్చుకుంటూ ఉంటారు. ట్రైలర్లో.. ‘ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయచేయగలిగే ఒకే ఒక్క పవరఫుల్ వెపన్ అమ్మాయి’ అని నాని హీరోయిన్‌ను చూసి అంటాడు. దాంతో వెనకే ఉన్న నటి లక్ష్మి ‘నేను వెళతా’ అనడం నవ్వులు పూయిస్తోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LdrAHF

RRR: రాజమౌళి ఫొటోపై తారక్ కామెంట్

ఎప్పుడో కానీ తారక్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపించవు. ఆయన ఏదో ఒకటి పోస్ట్ చేయకపోరా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో తారక్ జక్కన్న ఫొటోతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. రాజమౌళి సెట్స్‌లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. ఈ ఫొటోకు తారక్ ఇచ్చిన క్యాప్షన్ హైలైట్‌గా నిలిచింది. ‘మ్యాన్ బిఫోర్ ది స్టార్మ్’ అని తారక్ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా రెండో షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 22న సినిమాలో తారక్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. డీవీవీ దానయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చెర్రీకి జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. తారక్ పాత్రకు జోడీగా ఇంకా వెతకాల్సి ఉంది. ఇప్పటికే ఓ బ్రిటిష్ నటిని సినిమాలో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2020, జులై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LgU5V1

ఆ ఇద్దరు భామలు కావాలంటున్న సల్లూభాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఎందరో నటీమణులను బాలీవుడ్‌కు పరిచయం చేసి వారికి కెరీర్‌ను అందించారు. వారిలో కొందరు సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తుంటే మరికొందరి కెరీర్ ఒక సినిమాకే పరిమితం అయిపోయింది. వారిలో డైసీ షా ఒకరు. సల్మాన్ ‘జైహో’ సినిమాలో డైసీకి అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా డైసీకి బ్రేక్ ఇవ్వలేకపోయింది. అయితే ప్రస్తుతం సల్మాన్ ‘ఇన్‌షా అల్లా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఆలియా భట్‌ను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణను ప్రస్తుతానికి వాయిదా వేశామని సల్మాన్, భన్సాలీ ఇటీవల ప్రకటించారు. అయితే సినిమాను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇందుకు కారణం సల్మాన్ మరో ఇద్దరు భామలను సినిమాలో ఎంపిక చేసుకోవాలని భన్సాలీని డిమాండ్ చేయడమేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. డైసీ షా, వలూషా డిసౌజాలను కూడా సినిమాలో పెట్టుకుంటే బాగుంటుందని సల్మాన్ అభిప్రాయం. అది భన్సాలీకి నచ్చలేదని అందుకే చిత్రీకరణ వాయిదా వేశారని తెలుస్తోంది. మరో కారణం ఏంటంటే.. తనకు 100 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వాలని సల్మాన్ భన్సాలీని కోరారట. తాను అంత ఇచ్చుకోలేనని భన్సాలీ చెప్పడంతో సల్మాన్‌కు కోపం వచ్చిందని సినిమా వాయిదా పడటానికి ఇది కూడా ఒక కారణమేనని బీటౌన్ టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30EPhPB

ఆమె నన్ను కొట్టినందుకు బాధలేదు : ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’ పుణ్యమా అని అంతర్జాతీయ స్థాయిలో పేరు మారుమోగిపోతోంది. అయితే ఇటీవల ప్రభాస్ ‘సాహో’ సినిమా చిత్రీకరణను ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా.. అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారి కోసమని ప్రభాస్ ఎంతో ఓర్పుతో ఫొటోలకు పోజులిచ్చారు ఆ సమయంలో ఓ యువతి ప్రభాస్ తనతో ఫొటో దిగాడన్న ఆనందంతో ‘డార్లింగ్’ చెంపపై సున్నితంగా కొట్టింది. దాంతో ప్రభాస్ కొంత షాకైనా నవ్వి ఊరుకున్నారు. దీని గురించి ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘అలాంటి చేష్టలు నాపై ప్రేమతోనే చేస్తుంటారు. ఆమె కొట్టినందుకు నేనేమీ బాధపడలేదు. నన్ను కలవకుండా ఆరాధిస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు. వారందరికీ నేను రుణపడి ఉంటాను’ అని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్.. ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిరోజే సినిమా రూ.50 కోట్ల బడ్జెట్‌ను రాబడుతుందని సినీ విశ్లేషకుల అంచనా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HsDFYk

యోగిబాబుకు నిత్యానంద నోటీసులు

యోగిబాబు మంచి కమెడియన్‌గా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన హాస్యనటుడిగా నటించిన చిత్రం ‘పప్పీ’. ఈ సినిమాలో యోగిబాబు వివాదాస్పద బాబా స్వామి పాత్రను పోషించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌లో యోగిబాబు నిత్యానంద పాత్రను పోషించారు. తన వద్దకు వచ్చే భక్తులను నమ్మించి మోసం చేస్తున్నట్లుగా ఆ పాత్ర ఉందని నిత్యానంద భావించారు. దాంతో యోగిబాబుతో పాటు ‘పప్పీ’ చిత్రందానికి నోటీసులు పంపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ పాత్ర ఉందంటూ ఇప్పటికే ఓ హిందూ సంఘం చిత్ర బృందంపై కేసు వేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై దర్శకుడు నత్తు స్పందిస్తూ.. తాము ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని, సినిమాలో యోగిబాబు నిత్యానందను ఆరాధించే వ్యక్తిగా కనిపించనున్నారని తెలిపారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషసల్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నత్తూ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MFqV4U

See Venkatesh Craze In Nellore



from VIDEOS – Tollywood https://ift.tt/2Hv2Ols

అతను చెప్పింది అబద్ధం.. రాజకీయాల్లోకి రాను

సన్నీ డియోల్, ఊర్మిళ మటోండ్కర్ వంటి స్టార్ బాలీవుడ్ నటుుల రాజకీయాల్లోకి అడుగుపెట్టేశారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఆయన రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నేత మహాదేవ్ జంకర్‌ను కలిశారు. జంకర్ సంజయ్‌ను కలిసిన ఏ విషయం గురించి చర్చించారో తెలీదు కానీ.. సమావేశం అయ్యాక మీడియా ముందుకు వచ్చి.. సంజయ్ తన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. దాంతో సంజయ్ పేరు ఇప్పుడు అందరి నోటా నానుతోంది. అయితే జంకర్ చెప్పింది అబద్ధమని తాను ఎలాంటి పార్టీలో చేరడం లేదని సంజయ్ తాజాగా ప్రకటించారు. ‘నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. జంకర్ నాకు సోదరుడు, స్నేహితుడు లాంటివారు. భవిష్యత్తులో ఆయన రాజకీయ నాయకుడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. 2009లో సంజయ్ సమాజ్‌‌వాది పార్టీ తరఫున లఖ్‌నవూ నుంచి పోటీ చేశారు. అక్రమ ఆయుధాలు కలిగిన కేసులో కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సంజయ్.. ఇక తన సమయాన్నంతా కుటుంబం, సినిమాల కోసమే కేటాయించాలనుకుంటున్నాని సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ప్రస్థానం’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో ఇదే టైటిల్‌తో విడుదలైన సినిమాకు రీమేక్‌గా రాబోతోంది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన దేవాకట్టానే హిందీ వెర్షన్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/343b7OM

ఫైవ్‌స్టార్ హోటల్ ఫుడ్‌లో పురుగు.. పవన్ హీరోయిన్ ఆగ్రహం

కాకా హోటల్ అయినా ఫైవ్‌స్టార్ హోటల్ అయినా ఫుడ్ విషయంలో నాణ్యత పాటించడంలేదు. ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా హోటల్ యజమానులు మాత్రం భయపడటంలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే చాలా మంది చిన్న చిన్న హోటల్స్‌లో తినడానికి భయపడుతున్నారు. కానీ, పేరుమోసిన ఫైవ్ స్టార్ హోటల్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్, నటి మీరా చోప్రాకు ఎదురైన అనుభవమే దీనికి పెద్ద ఉదాహరణ. హిందీతో పాటు తమిళం, తెలుగు చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘బంగారం’, ‘వాన’ వంటి సినిమాల్లో నటించారు. ఇటీవల ఆమె అహ్మదాబాద్‌లోని హిల్టన్‌కు చెందిన డబుల్‌ట్రీ ఫైవ్ స్టార్ హోటల్‌లో స్టే చేశారు. అక్కడ ఆమెకు సెర్వ్ చేసిన ఫుడ్‌లో చిన్న చిన్న పురుగులున్నాయి. ఆ పురుగులను చూసిన మీరాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. హోటల్‌ను ఏకిపారేశారు. వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మీరా చోప్రా.. ‘‘అహ్మదాబాద్‌లోని డబుల్‌ట్రీ హోటల్‌లో ఉన్నాను. నాకు ఫుడ్‌తో పాటు చిన్న చిన్న పురుగులను ఈ హోటల్ వడ్డించింది. ఇలాంటి హోటళ్లకు మీరు బోలెడంత డబ్బు చెల్లిస్తారు.. కానీ, ఇవి మాత్రం పురుగులను వడ్డిస్తాయి. మరీ ఇంత దారుణమా. ఎఫ్ఎస్ఎస్ఏఐ దయచేసి తక్షణమే చర్యలు తీసుకోండి. ఆరోగ్య నాణ్యత విలువలు ఎక్కడున్నాయి’’ అని ప్రశ్నించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zs7sqp

ప్రభాస్‌తో అనగానే యస్ అనేసా: బాలీవుడ్ సుందరి

‘సాహో’ సినిమాలో సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే, మరో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక పాటలో ప్రభాస్‌తో ఆడపాడింది. ప్రభాస్, జాక్వెలిన్ ఆడిపాడిన ‘బ్యాడ్ బోయ్’ సాంగ్ ఇప్పటికే విడుదలైంది. ఈ పాటలో జాక్వెలిన్ అందాలు, ప్రభాస్ హ్యాండ్‌సమ్ లుక్ చేసి వహ్వా అన్నారు. ఈ వీడియో సాంగ్ ప్రోమో మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా రాబట్టింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో బాలీవుడ్ భామ కూడా నటించింది. పలు హిందీ సినిమాల్లో నటించిన జర్మన్ మోడల్ ఎవెలిన్ శర్మ.. ‘సాహో’ సినిమాలో ఒక పాత్ర చేసింది. ఆ పాత్ర ఏమిటో తెలీదు కానీ, దర్శకుడు సుజీత్ అడిగిన వెంటనే తాను కాదనలేకపోయానని ఎవెలిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాను ‘బాహుబలి’కి వీరాభిమానినని చెప్పింది. Also Read: ‘‘హీరో!! బాహుబలికి పెద్ద ఫ్యాన్ అయిన నేను ప్రభాస్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంత బాగా ఆస్వాదించుంటానో ఊహించుకోండి. ‘సాహో’లో నటిస్తారా అని సుజీత్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు, నేను చెప్పిన ఒకే ఒక్క సమాధానం: యస్!!!’’ అని ఎవెలిన్ శర్మ ట్వీట్ చేసింది. అలాగే, ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. కాగా, ‘సాహో’ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 51 నిమిషాలు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేకర్‌తో పాటు తమిళ నటుడు అరుణ్ విజయ్, మలయాళ నటుడు లాల్ కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LdywEW

కారోణ్య కత్రిన్

కారోణ్య కత్రిన్

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery https://ift.tt/2U2QePt

‘ఇట్లు మీ శ్రీమతి’ మూవీ ఓపెనింగ్

‘ఇట్లు మీ శ్రీమతి’ మూవీ ఓపెనింగ్

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery https://ift.tt/2ZoqKRD

Rashmi Gautam Stills

Photography: Ekor

Photography: Ekor

Photography: Ekor

Photography: Ekor

Photography: Ekor



from GALLERY – Tollywood https://ift.tt/2L4h7OF

Sneha Ullal Stills

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram



from GALLERY – Tollywood https://ift.tt/30vrxgV

Kodali Nani Straight Warning To ChandraBabu



from VIDEOS – Tollywood https://ift.tt/2KTL3OR

Babu Mohan: జగన్ పాలన మూడు పువ్వులు ఆరు కాయలు: బాబూ మోహన్

నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ సినిమాల్లో నటిస్తా.. చివరకి నా శవాన్ని కూడా యాక్టింగ్‌కి ఇస్తా అన్నారు ప్రముఖ కమెడియన్, బీజేపీ లీడర్ . ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా జీవితంపై ఆసక్తికరమైన విషయాలు తెలిపిన ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నేతల పాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. Read Also: మోదీ పాలన భేష్.. దేశంకోసం ప్రధాని మోదీ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన తీసుకునే ఒక్కో నిర్ణయం దేశ స్థితిగతులను మార్చుతోంది. నాయకుడు అంటే అలా ఉండాలి. బీజేపీలో తనది కార్యకర్త పాత్రే. Read Also: ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చేశా.. నాకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్టు ఇవ్వక పోవడం వల్ల పార్టీ నుండి బయటకు రాలేదు. టిక్కెట్ అనేది నాకు ఆఫ్ట్రాల్. ఆత్మాభిమానం చంపుకోలేకే బయటకు వచ్చేశా. నాకు ఎన్టీఆర్ నేర్పింది అదే. ఢిల్లీ నుండి ఆహ్వానం వచ్చింది అందుకే బీజేపీలో చేరా. డైనమిక్.. కేసీఆర్ పాలన కటిక చీకటి ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలను కటిక చీకటిలా ఉంది. ఏపీలో యువ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాలన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. బ్రహ్మాండమైన స్పీడ్‌లో డైనమిక్ లీడర్‌గా ముందుకు వెళ్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Mxa4Bn

Raj Tarun: అతడిపై 490 కేసు.. అమ్మాయిని ట్రాప్ చేశాడు: రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర

కారు యాక్సిడెంట్ కేసులో సినిమా కథను తలపిస్తోంది. కారు యాక్సిడెంట్ చేసి పారిపోయిన రాజ్ తరుణ్.. మరుసటి రోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై.. హెల్మెట్ పెట్టుకోండి. సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ప్రయాణికులకు సూచనలు ఇచ్చారు. అయితే ప్రమాద స్థలం నుండి ఎందుకు పారిపోయావ్ రా బాబూ.. అంటే ఏం చేయాలో అర్ధం కాలేదని లాజిక్‌లకు దొరికిపోయే ఆన్సర్‌లు ఇచ్చాడు. Read Also: ఇదిలాఉంటే అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? ప్రమాద స్థలం నుండి రాజ్ తరుణ్ పారిపోతున్న సందర్భంలో కార్తీక్ అనే వ్యక్తి వెంటాడి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఆ వీడియో రాజ్ తరుణ్‌‌ను బ్లాక్ మెయిల్ చేసి.. కుదరకపోవడంతో మీడియాకెక్కి రచ్చ చేస్తున్నాడు కార్తీక్ అనే వ్యక్తి. అయితే కార్తీక్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు రాజ్ తరుణ్ మేనేజర్, ప్రముఖ నటుడు రాజా రవీంద్రా. అసలు కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నాడో? తెరవెనుక ఏం జరిగిందో మీడియాకి వివరించారు. ‘రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే. నేనూ టీవీలలో చూసి తెలుసుకున్నా. ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయాలో కూడా నాకు తెలియలేదు. కన్ఫ్యూజన్‌లో ఉండగా.. కార్తీక్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేశారు. అతనికి నా ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందో తెలియదు. ‘రాజ్ తరుణ్ యాక్సిడెంట్ చేసి చెప్పులు కూడా లేకుండా పరుగెత్తుకుని పోతున్నాడు.. ఆ వీడియో నా దగ్గర ఉంది అని నాకు పంపించాడు. ఈ వీడియో మీడియాకి ఇవ్వమంటారా? లేక వచ్చి కలుస్తారా? అని అడిగాడు. అతని ఉద్దేశం నాకు అర్ధమై మళ్లీ ఫోన్ చేస్తానని నేను పెట్టేశా. ఆ తరువాత అతను ప్రతి 15 నిమిషాలకు ఫోన్ చేసి.. రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. నేను చాలా ఆర్ధిక పరిస్థితుల్లో ఉన్నాను.. డబ్బులు కావాలన్నాడు. అంతలేదయ్యా.. అంటే మీ పరువుకంటే ఐదులక్షలు ఎక్కువా? అని అడిగాడు. నేను తరువాత రాజ్ అసిస్టెంట్‌కి ఇతని నంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పా. అతనితో కనీసం మూడు లక్షలు ఇచ్చినా వీడియో డిలీట్ చేస్తా అన్నాడు. Read Also: కారులో మహిళ.. యాక్సిడెంట్ అనుకోకుండా అయ్యింది.. కారులో ఎవరెవరో ఉన్నారు రాజ్ తరుణ్ తాగి ఉన్నాడు అని కార్తీక్ ఆరోపిస్తున్నాడు. అతను చెప్పేవాటిలో నిజం లేదు. డబ్బుకోసమే బ్లాక్ మెయిల్ చేశాడు. కుదరక పోవడంతో ఇప్పుడు మీడియాకి ఎక్కాడు. కార్తీక్ మోసగాడు అమ్మాయిని మోసం చేసి.. కార్తీక్ ఎవరో బయట వ్యక్తి కాదు.. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. అతనో క్యాస్ట్యూమ్ డిజైనర్. గతంలో ఆయన ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఒక షోకి వచ్చిన అమ్మాయిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అతనిపై గృహహింస నేరం కింద 490 కేసు ఉంది. రాజ్ తరుణ్ విషయంలో నన్ను బయటకు లాగారు కాబట్టి నేను స్పందిస్తున్నా. అక్కడ ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. నిజంగా అతనిదగ్గర అన్ని ఆధారాలు ఉంటే.. పోలీసులకు ఆ వీడియో ఇవ్వొచ్చు కదా. రెండురోజులు కనిపించకుండా బేరాలాడి ఇప్పుడు వచ్చి డ్రామాలాడుతున్నాడు. అతనిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటా. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అన్నారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P74fwp

‘కౌశల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

క్రికెట్ అంటే కష్టమైన ఆటా? సున్నితంగా ఉండే అమ్మాయిలు అస్సలు ఆడలేరా? పట్నం అమ్మాయిలు మాత్రమే క్రికెట్ ఆడితే మరి పల్లెటూరు అమ్మాయిలు ఈ ఆటకు దూరం కావాల్సిందేనా? ఈ ప్రశ్రలకు సమాధానమే ఈ సినిమా.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2Hg06jB

‘కౌశల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

క్రికెట్ అంటే కష్టమైన ఆటా? సున్నితంగా ఉండే అమ్మాయిలు అస్సలు ఆడలేరా? పట్నం అమ్మాయిలు మాత్రమే క్రికెట్ ఆడితే మరి పల్లెటూరు అమ్మాయిలు ఈ ఆటకు దూరం కావాల్సిందేనా? ఈ ప్రశ్రలకు సమాధానమే ఈ సినిమా.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2Hg06jB

‘కౌశల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

క్రికెట్ అంటే కష్టమైన ఆటా? సున్నితంగా ఉండే అమ్మాయిలు అస్సలు ఆడలేరా? పట్నం అమ్మాయిలు మాత్రమే క్రికెట్ ఆడితే మరి పల్లెటూరు అమ్మాయిలు ఈ ఆటకు దూరం కావాల్సిందేనా? ఈ ప్రశ్రలకు సమాధానమే ఈ సినిమా.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2Hg06jB

‘కౌశల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

క్రికెట్ అంటే కష్టమైన ఆటా? సున్నితంగా ఉండే అమ్మాయిలు అస్సలు ఆడలేరా? పట్నం అమ్మాయిలు మాత్రమే క్రికెట్ ఆడితే మరి పల్లెటూరు అమ్మాయిలు ఈ ఆటకు దూరం కావాల్సిందేనా? ఈ ప్రశ్రలకు సమాధానమే ఈ సినిమా.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Hg06jB

అప్పా.. నాలాంటి ఎందరికో మీరు స్ఫూర్తి: రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

తండ్రికి తగ్గ తనయుడిగా.. మెగా సామ్రాజ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెల్లగలిగే సామర్థ్యమున్న ‘మగథీరుడు’గా రామ్ చరణ్‌ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. మెగా పవర్ స్టార్‌గా అభిమానులచేత పిలిపించుకుంటున్నారు. సోలో హీరోగా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. తనలాంటి మరో స్టార్ హీరో ఎన్టీఆర్‌తోనూ మల్టీస్టారర్‌కు సై అన్నారు. ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకురావడంలో తనవంతు చేయి వేస్తున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి తన తండ్రి చిరంజీవినే హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. చరిత్ర మరిచిపోయిన ఒక పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తన తండ్రి ద్వారా తెలుగు ప్రజలకు చెప్పబోతున్నారు. అయితే, ఇవన్నీ తాను చేయడానికి గల ఒకే ఒక్క కారణం మెగాస్టార్ చిరంజీవి అని ఈ కొణిదెల వారబ్బాయి చెబుతున్నారు. Also Read: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. చిరంజీవి నేడు 64వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనతో పాటు తనలాంటి ఎందరికో చిరంజీవి స్ఫూర్తి అని వెల్లడించారు. ‘‘నాతోపాటు కొన్ని మిలియన్ల మందికి మీరొక స్ఫూర్తి, ఒక మెంటర్, ఒక గైడ్. వారంతా మిమ్మల్ని మెగాస్టార్ అని పిలుస్తారు. నేను మిమ్మల్ని అప్పా అంటాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా. మా అందరికి మీరు ఇలానే స్ఫూర్తినిస్తారని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను’’ అని చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30qOth8

చిరంజీవికి దేవి మ్యూజికల్ బర్త్‌డే విషెస్.. ఊపేస్తుందంతే!

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తి. ఇండస్ట్రీలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ ఫ్యాన్స్ ఖాతాలో చాలా మందే ఉన్నారు. వీరిలో చాలా మంది తమకు స్వయంకృషి ఎదిగిన తీరు స్ఫూర్తి అని చెబుతుంటారు. అలాంటి వాళ్లలో సంగీత సంచలనం, రాక్ స్టార్ ఒకరు. ‘ఆనందం’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘వర్షం’, ‘ఆర్య’ లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు దేవి. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాతో దేవీ శ్రీ ప్రసాద్‌కు చిరంజీవి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాతో దేవి మరో స్థాయికి వెళ్లిపోయారు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. Also Read: చిరంజీవి ‘అందరివాడు’, ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాలకు కూడా దేవీనే సంగీతం సమకూర్చారు. అంతెందుకు చిరు రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’కి కూడా దేవీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవీపై చిరంజీవికి అంత నమ్మకం. మెగాస్టార్ తనపై కురింపించిన ప్రేమను దేవీ శ్రీ ప్రసాద్ అవకాశం దొరికినప్పుడల్లా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా దేవీ శ్రీ కాన్సెర్ట్ జరుగుతుందంటే అందులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ టైటిల్ సాంగ్ ఉండాల్సిందే. ఇప్పుడు ఆ సాంగ్‌ను దేవి మరోసారి వినిపించే అవకాశం ఆయనకు వచ్చింది. ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. నేడు చిరంజీవి 64వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ‘సూపర్ డూపర్ మ్యూజికల్ హ్యాపీ బర్త్‌డే’ చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో తన టీమ్‌తో కలిసి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ టైటిల్ సాంగ్‌ను ఆలపించిన వీడియోను పొందుపరిచారు. ఈ వీడియో ద్వారా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ ఇప్పుడు దూసుకుపోతోంది. చిరంజీవి అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. లైకులు కొడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33TAIKi

వెంకట్రావు గారి పెద్దబ్బాయ్.. ఆంధ్రులు మెచ్చిన ‘చంటబ్బాయ్’

రాళ్లే మాట్లాడ‌తాయి.. అనంత జీవ‌న సాగ‌రమ‌థ‌నాన రాళ్లే ఒడ్డునుండి కెర‌టాల ధాటిని త‌ట్టుకుంటాయి. బాధ‌లోనూ/దుఃఖంలోనూ ఆ రాళ్లే కాస్త ఓదార్పు నిస్తాయి. జీవితేచ్ఛకు ఆలంబ‌న‌గా నిలిచిన ప్రతి సంద‌ర్భాన ఆ కొణెద‌ల వారింటి పెద్దోడు ఏనాడూ ఓడిపోలేదు. అదిరి బెదిరి స‌మ‌స్యల‌కు స‌లామ్ కొట్టి పారిపోలేదు. జీవితం ఇది, జీవించాలంతే అన్న ఒక వాద‌నకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచి, త‌న‌ని తాను నిరూపించుకున్నాడు. క‌న్నీళ్లు పెట్టుకుని మ‌ద్రాసు న‌గ‌రిలో న‌డ‌యాడిన వాడు, కంట త‌డి తుడిచి ఎంద‌రెంద‌రి ఇళ్లకో తానే పెద్ద కొడుకు అయ్యాడు. తెర‌వేల్పు అయ్యాడు. ఆ జ‌గ‌దేగ‌వీరునికి జ‌న్మదిన శుభాకాంక్షలు చెబుతూ అందిస్తున్న ప్రత్యేక క‌థ‌నం. షూటింగ్ షూటింగ్ షూటింగ్.. రంగులు మాట్లాడుతున్నంత‌గా తానేం మాట్లాడ‌లేక‌పోతున్నాడు. కొంత కాలం అయ్యాక రంగుల క‌ల‌లు రంగుతేలే వాస్తవాలు. అన్నీ అన్నీ క‌ద‌లాడాయి.. ఆ ఇంటికి క‌ల‌లు చుట్టరికం చేశాయి. గెలుపు ఆత్మీయ ఆతిథ్యం అందుకున్న వేళ ఆ క‌ల‌ల‌న్నీ నిజాల‌య్యాయి. నిజంగానే నిజంగానే ఆ పొంత నిండిందా.. నిజంగానే నిజంగానే ఆ నిండు కుండ ఏనాడ‌యినా తొణికిందా అనేంత‌గా ఇత‌రులు అంటే శ‌త్రువులు సైతం ఈర్ష్యాసూయ‌లకు లోన‌య్యేలా ఎదిగాడు. ఎదిగి ఒదిగాడు. ‘చిరు త్యాగ‌రాజు నీ ప‌ద‌ములు ప‌లికిన మ‌ది’ అంటూ కలకత్తా నగ‌రి వీధుల్లో న‌డ‌యాడాడు. ‘నీతోనే ఆగేనా బిళ‌హ‌రి’ అని కీర్తించాడు. రుద్రవీణ మీటుతూ.. ఆ తంత్రులు ఒలికించే స్వరాల‌కు సామాజిక బాధ్యత అందించాడు. అవును! ఏ క‌ళకు అయినా ఏ క‌థకు అయినా జీవిత రంగం వేదిక కాదా! అని మ‌రోమారు నిరూపించాడు. అవును! అత‌డు న‌డిచే న‌క్షత్రం.. అవును! అత‌డు రాగాల పల్లకిలో కోయిల‌మ్మ.. మ‌న కాలం చార్లీ చాప్లీన్. బాల‌చంద‌ర్, విశ్వనాథ్, జంధ్యాల లాంటి వారంతా తీర్చిదిద్దిన బొమ్మ. రాఘవేంద్ర రావు, కోదండ రామిరెడ్డి వంటి వారు మ‌లిచిన క‌మ‌ర్షియ‌ల్ బొమ్మ. ఇండ‌స్ట్రీ మెచ్చిన బిగ్‌బాస్. ఇదంతా ఒక్క రోజులోనే వ‌చ్చిందా.. ఆశ్చర్యం..!! ‘స్టార్ స్టార్ మెగాస్టార్’ ఇలా అర‌చి ఎంత కాలం అయ్యింది. ‘సుప్రీం హీరో’ అని రాజ్ కోటి స్వర‌ప‌రిచిన పాట పాడుకుని ఎంత కాలం అయ్యింది. ఇవ‌న్నీ అభిమానుల మ‌దిలో చ‌క్కర్లు కొడుతుండ‌గానే ఏడాది గ‌డిచిపోయింది. గూగుల్‌లో అతడి స్థానం నంబ‌ర్‌గా నిలిచిపోయింది. ద‌టీజ్ చిరు.. అనండిక జై చిరంజీవ అని..! ఏటా ఓ వ‌సంతం.. ఏటేటా ఓ జ‌న్మదినం.. పండుగ రోజు అభిమానుల‌కు క‌న్నుల వాకిట రంగుల లోకం తీర్చిదిద్దిన తారకు ఆ నేల సాహో అంది. ఆ క‌ష్టానికి ఆ శ్రమ‌వేదానికి జేజేలు ప‌లికింది. ఒక చిన్న అభిలాష ప‌ది మందికీ ఊపిరెలా అవుతుంది..? చిరంజీవిని అడుగు చెబుతాడు. య‌మ‌హా న‌గ‌రిలో బ‌తుకెలా ఉంటుంది..? మెరీనా తీరంలో బతుకెలా ఉంటుంది..? చిరంజీవిని అడుగు చెబుతాడు. ఓరినాయినోయ్.. వాడినే అడుగు ప్రాణం ఖ‌రీదులో జాలాది పాట విలువెంత‌ని చెబుతాడు. ఒన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్.. ఒన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియ‌న్ స్టార్ మెగాస్టార్.. యావ‌త్ ద‌క్షిణ భా ర‌తం ఇప్పటికే ఒకే గొంతుక‌తో ఏక‌తాళంతో బృంద‌గానంతో ఒప్పుకున్న నిజం. ‘న‌మ్మకు న‌మ్మకు ఈ రేయిని’ అంటున్నాడో చోట క‌వి. వెన్నెల క‌వి ఆయ‌నే ఆంధ్రుడెవ‌రంటే జ‌గ‌దేకవీరుడ‌ని చూపిస్తానంటూ.. హాయిగానం ఒక‌టి వినిస్తున్నారు. అవును! ఆ తార ఈ తార కూడికల ద‌గ్గర ఆకాశం ఎలా ఉంటుంది. వెలుగులు పంచుకునే వేళ ఆయ‌నింట మ‌రో బంగారం వ‌చ్చాడు. బంగారం లాంటి మ‌రికొన్ని క‌ల‌ల‌ను నిజం చేశాడు. ఆయ‌న ఒక చ‌ర‌ణ్ కావొచ్చు. ఒక ప‌వ‌న్ కావొచ్చు..! ఇంకా త‌మ త‌మ రంగాల్లో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని రాణించిన వారెంద‌రో కావొచ్చు..! అవును! ఆ కెర‌టం ద‌గ్గర మ‌నం ప్రేక్షకులం. ఆ ఇంద్రధ‌న‌స్సును తీసుకువ‌చ్చిన ఆకాశం ద‌గ్గర మ‌నం అంటే ఈ అభిమాన గ‌ణం నేర్చుకోవాల్సిందెంతో! ఇప్పుడు అడ‌గండి కొమ్మలు తాకిన కోయిల ఆయ‌న గురించి ఏమ‌ని పాడుతుందో! ఒన్ ఫ్లాష్ క‌ట్: అన‌గ‌గ‌న‌గా.. మ‌హాన‌టి నోట సినిమా ప్రివ్యూ న‌డుస్తుంది. చెన్నై అనుకుంటా.. చాలా ప్రశాంతంగా ఉంది. మ‌హాన‌టి సావిత్రికి ప్రివ్యూ చూపిస్తున్నారు. బ‌క్క చిక్కిన దేహంతో ఓ కుర్రాడు.. అప్పటికింకా పెద్దగా పాపుల‌ర్ కాలేదు. కానీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాడు త‌న ఆట‌తో.. ఎవ‌రీ కుర్రాడు అని అడిగారామె. పేరు చెప్పారు.. ఊరు చెప్పారు.. అంతా విన్నాక ఆ క‌ళ్లున్నాయి చూడండి.. అవి చాలు ఈ కుర్రాడు ఇండ‌స్ట్రీని ఏలేస్తాడు అనేందుకు అని అన్నారామె.. నవ్వారామె.. ఆ కుర్రాడిని దీవించారామె. క‌ళ్లతోనే వేవేల భావాలు ఒలికించు న‌టి నుంచి వ‌చ్చిన ఆ అభినంద‌న అందుకున్న ఆ కుర్రాడు కొణిదెల శివ‌శంక‌ర వ‌ర ప్రసాద్.. ఆ సినిమా పేరు మ‌న ఊరి పాండవులు. ఇలానే రాయాలి మ‌నం.. అప్పటికింకా మెగాస్టార్‌గా అంత‌గా పాపుల‌ర్ కాలేదుగా.. అలానే రాయాలి మ‌నం.. కొంత కాలం అత‌డు సుప్రీంహీరో.. అత‌డి అంద‌మే హిందోళం.. అవును! అత‌డి చెంత ఏ క‌న్నియ న‌వ్వు అయినా మ‌ల్లియ విచ్చుకున్నట్లే.. అవును! అతడికి జీవితం ఏమిచ్చింది అంటే కోటానుకోట్ల అభిమానుల‌ను.. కొన్ని నెర‌వేరిన అభిలాష‌ల‌ను. వెంకట్రావు గారి పెద్దబ్బాయ్.. స‌్వయంకృషీవ‌లుడు ఓ చిన్న కుటుంబం.. ఆ వివ‌రం తెలియాలంటే.. ఓ సారి నెల్లూరు పోవాలి నీవు. నీకు తెల్సా వాడు చాలా చిన్నవాడు. నాన్న దెబ్బల‌కు బాగా ఇబ్బంది ప‌డిన‌వాడు. అమ్మ ప్రేమ‌కు బాగా ద‌గ్గరయిన వాడు. అలా అని నాన్నేమీ విల‌న్ కాదు. ఈ హీరోని స్టార్‌ని చేసిన రియ‌ల్ హీరో అత‌డు. మామూలు మ‌నిషి అత‌డు. బర‌ువు బాధ్యత‌ల కొస‌ల న‌డుమ ఇరుక్కున్నవాడు. స్వస్థలం గోదావ‌రి తీరం కావొచ్చు.. కానీ ఉద్యోగం అక్కడ కదా! ఆ రోజుల్లో ఓ కానిస్టేబుల్ కొడుకుగా ఎవ్వరికీ తెలియ‌ని వాడు. నాన్నలానే న‌ట‌నంటే ప్రేమ ఉన్నవాడు. వాడు చాలా కాలం త‌రువాత ‘అంద‌రివాడు’గా ఎదిగాడు. ‘స్వయంకృషి’కి ఉన్న విలువెంతో చాటాడు. అభిమానులూ వంద‌నాలు చెప్పాలి మీరు.. కొట్టండ్రా చ‌ప్పట్లు.. ఇది క‌దా! అంటే..! ఆన్ రికార్డ్: ఈ సారి ఓ చిన్న క‌థ.. డైరెక్టర్ సుక్కూకి మాత్రమే ఆనందాన్నిచ్చే క‌థ ఇది. శంక‌ర్ దాదా సిరీస్‌లో భాగంగా ఫ‌స్ట్ పార్ట్ తెర‌కెక్కుతోంది. డ‌బ్బింగ్ చెబుతున్నాడు చిరు. ‘ఆర్య’ క‌థ చెప్పేందుకు వెళ్లాడు సుక్కూ. చిరంజీవి విన్నాడు.. ఉండండి వ‌స్తాను అని చెప్పి వెళ్లాడు. వ‌చ్చాక మీ క‌థ బాగుందండి గో ఎ హెడ్.. ఏం కాదు ధైర్యంగా ముందుకు వెళ్లండి అని భుజం త‌ట్టాడు. సుక్కూ మాటల్లో చెప్పాలంటే ఆయ‌న‌కు అది ఓ ఫ్రీజింగ్ పాయింట్. ఈసారి అదే గోదావ‌రి తీరం నుంచి అదే దారి నుంచి బేబ‌మ్మ అనే గాయ‌ని వ‌చ్చారు. పాట విన్నాడు పొంగిపోయాడు. త‌న ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి పంపాడు. వాడు ఆపద్బాంధవుడు. వాడు అభిమానధ‌నుడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్రతిభ ఎక్కడున్నా జై కొడ‌తాడ‌త‌డు. ఇత‌రుల స‌మయానికి వారికి ఆయా సంద‌ర్భాల్లో ద‌క్కిన విజ‌యాల‌కు ఎంతో విలువ ఇస్తాడు. భ‌ళా త‌మ్ముడా: అన్నని మించిపోయాడు ఒక‌డు ఈ సారి అన్నని మించిపోయాడు ఒక‌డు. న‌వ్వుతున్నాడు.. క‌న్నీరు పెడుతున్నాడు.. అవి ఆనంద భాష్పాలు అని ఆ ఇల్లాలికి తెలుసు. అమ్మ లాంటి వదిన ముందు స్టేజ్‌పై ప‌వ‌న్ ఇలా చెబుతున్నాడు. ఇంకా ఏవేవో చెప్పుకుంటూ పోతున్నాడు. త‌మ్ముడు న‌న్ను దాటి పోయాడు అని అన్నాడ‌ట‌.. ఎవ‌రి తోనో! వాడు ఇంట్రావ‌ర్ట్.. ఎప్పుడూ ఇంట్లో మాట్లాడ‌నే మాట్లాడడు అని చెప్పేవాడంట‌! అలాంటి తమ్ముడు త‌న‌ని మించి పోయాడు.. ఎవ్వరితోనూ కల‌వ‌డ‌ని అనుకున్న త‌మ్ముడు అన్నయ్య అభిమానులంద‌రినీ క‌లుపుకుని పోయాడు. అది క‌దా ఆ త‌ల్లికి కావాల్సింది. అభిమానులూ మ‌ళ్లీ! కొట్టండి చ‌ప్పట్లు. ఎగైన్ అండ్ ఎగైన్ ఈల పొడు - గోల పొడు. బ్యాక్ బ్యాక్ బ్యాక్: మ‌ళ్లీ మెరీనా తీరానికి పోవాలి మ‌నం త‌న గురించి అవాకులు చ‌వాకులు పేలే పాండి బజార్ వ‌ద్దన్నాడు.. త‌నకు ఆనందాన్నిచ్చే మెరీనా తీరాన్నే కోరుకున్నాడు. ‘‘ఇప్పటికీ మ‌నం చేయాల్సింది ఇదే.. ఎవ్వరేం మాట్లాడినా మెరీనా తీరంలో ఉన్నామ‌ని అనుకుని ఊరుకోవ‌డ‌మే.. అప్పుడే హాయి’’.. ఇదీ వాడి జీవితం.. ఇదీ వాడి వికాస పాఠం. అవును ఆ క‌వి అన్నాడు క‌దా ‘‘వెన్నెల దీపం కొంద‌రిదా అడ‌వికి సైతం వెలుగు క‌దా!’’ అలానే అత‌డు.. ఎంద‌రికో దారి ఇచ్చాడు.. దారి చూపాడు. ఓ సంద‌ర్భంలో రామూ (ఆర్జీవీ) మాట్లాడిన మాటలు సైతం విని న‌వ్వుకున్నాడు. ఇలానే చాలా మంది ఆయ‌నెవ్వరు మాకు తెలియదే అని కూడా అన్నారులేండి. అవి కూడా విని ఊరుకున్నాడు. న‌వ్వుకున్నాడు. అది క‌దా!సంస్కారం. నిన్నమొన్నటి వేళ ‘సైరా’ విష‌య‌మై కూడా ఏవేవో వార్తలొచ్చాయి. చ‌ర‌ణ్ కెరియ‌ర్ విష‌య‌మై ఏవేవో వార్తలొచ్చాయి. అవ‌న్నీ విన్నాడు.. మ‌ళ్లీ న‌వ్వుకున్నాడు. ఇవన్నీ కాదు అత‌డి గురించి ఏవేవో మాట్లాడి ప‌రువు పోగొట్టుకున్న వారెంద‌రో క‌దా! ఇన్నేళ్ల కెరియ‌ర్‌లో అత‌డు సాధించింది ఎంతో. ఆయ‌నే అన్నట్లు.. సాధించాల్సిందీ ఎంతో! ఈ జ‌న్మదిన వేళ ఆయ‌న‌కు అభినంద‌నలు.. శుభాకాంక్షలు. - ర‌త్నకిశోర్ శంభుమ‌హంతి


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HxQrFl

ఆ రోజుల్లో అందరికీ ఒకటే డ్రగ్.. ఆ డ్రగ్ పేరు చిరంజీవి!

మెగాస్టార్.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని గర్వం ప్రతి తెలుగు సినీ ప్రేమికుడి గుండెల్లో నుంచి బయటికి వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనొక పర్వతం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణిదెల శివశంకర వర ప్రసాద్ తన నటనకు ‘పునాదిరాళ్లు’ వేసుకుని ‘స్వయంకృషి’తో చిరంజీవిగా ఎదిగారు. అప్పటికే మహామహులతో నిండిపోయిన తెలుగు సినీ ప్రపంచంలో తాను ‘విజేత’గా నిలిచారు. అభిమానులకు ‘గ్యాంగ్ లీడర్’గా.. టాలీవుడ్‌కు మెగాస్టార్‌‌గా తనకంటూ చరిత్రలో ఒక పేజీని నింపుకున్నారు. నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా మెగాస్టార్ బర్త్‌డే విషెస్‌తో నిండిపోతోంది. అయితే, ఒకరు చెప్పిన బర్త్‌డే విషెస్ మాత్రం చిరంజీవి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ విషెస్ చెప్పింది.. ‘హృదయకాలేయం’ దర్శకుడు, ‘కొబ్బరి మట్ట’ నిర్మాత సాయి రాజేష్ అలియాస్ స్టీఫెన్ శంకర్. ఈయన చిరంజీవి వీరాభిమాని. నేడు మెగాస్టార్ పుట్టినరోజును పురష్కరించుకుని రాజేష్ ఫేస్‌బుల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ అద్భుతంగా ఉంది. ఆ రోజుల్లో అందరికీ చిరంజీవి ఒక డ్రగ్ అని, ఆయన సినిమా చూడని ప్రేక్షకుడు లేడని రాజేష్ అభివర్ణించారు. ‘‘పొద్దంతా రిక్షా తొక్కి, రాత్రి నేల టికెట్ కొన్న రిక్షావాడు, రోజంతా కూలీ చేసి, వారానికో సినిమా చూసే ఒక కార్మికుడు, నెలంతా కష్టపడి, జీతంలో కొంత భాగంతో కుటుంబాన్ని సినిమాకు తీసుకెళ్లే ఒక మధ్యతరగతి వాడు, చదువు, ఆత్మనూన్యత, పరీక్షలు, ప్రేమ, పేదరికం, అవమానం లాంటి సమస్యలతో బాధపడే ఒక విద్యార్థి.. ఆ రోజుల్లో అందరికీ ఒకటే డ్రగ్... ఆ డ్రగ్ పేరు చిరంజీవి... డబ్బైల్లో, ఎనబైల్లో, తొంబైల్లో పుట్టిన సగటు తెలుగు వాడి జీవితంలో ఆయనో భాగం. ఇరవై రూపాయిలు పెడితే.. ఆ నెల కష్టం మర్చిపోయేలా చేసేవాడు. డల్లాస్‌లో వేల రూపాయల డాలర్లు సంపాదించే వాడు కూడా శనివారం పెగ్గేసి ముఠామేస్త్రి పాటలు వింటూ.. జ్ఞాపకాలు నెమరేస్తాడు. చిరంజీవి ఉనికిని, చిరంజీవి స్థాయిని, చిరంజీవి స్టామినాని, చిరంజీవి అనే పేరుని నువ్వు అంగీకరించలేకపోతున్నావ్ అంటే నీ కళ్ళకి అదేదో అడ్డుపడి ఉండాలి. ఆడో పెద్ద సిరంజీవి మరి.. ఏరోయ్.. సిరంజీవి అనుకుంటున్నావేటి.. లాంటి మాటలు చెప్తాయి చిరంజీవి అనేటోడు హీరో అనే పదానికి పర్యాయపదమని. సినిమా ఇండస్ట్రీ వాడికైనా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అయినా.. చిరంజీవి జ్ఞాపకాలు చుట్టు ముట్టి ఉంటాయి. అందుకే వెనక్కి తిరిగి చూసుకుంటే.. అమ్మ, నాన్న, స్నేహితుడు, బడి, కాలేజీ, ప్రియురాలు.. వాటితో పాటు చిరంజీవి ఉంటాడు. నా బాధ అతని వల్ల సగం అవుతోంది. నా సంతోషం అతని వల్ల రెట్టింపు అవుతోంది. నా బాల్యం, యవ్వనం.. వెనక్కి తిరిగి చూసుకుంటే అతని జ్ఞాపకాలు నన్ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. నేను దర్శకుడిని కావడానికి ఆయనే నాకు స్ఫూర్తి. ఇండస్ట్రీలో గౌరవం అంటూ ఒకటి ఉందంటే అది ఆయన వల్లేనని నేను భావిస్తాను. లవ్ యు బాస్.. హ్యాపీ బర్త్‌డే ’’ అని రాజేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HiUCVe

‘బోయ్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

‘బోయ్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery https://ift.tt/2HjODPQ

సాహితి

సాహితి

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery https://ift.tt/2Hc7YCH

మెగా పవర్.. ‘సాహో’ని మించి ప్లాన్ చేస్తోన్న రామ్ చరణ్!

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది వస్తోన్న అత్యంత భారీ చిత్రాలు ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’. నిజం చెప్పాలంటే ‘సైరా’ కన్నా ‘సాహో’కు జాతీయ స్థాయిలో విపరీతమైన బజ్ ఉంది. ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘సైరా’ కూడా తక్కువేమీ కాదు. ఈ సినిమాను హిందీలో ఫర్హాన్ అక్తర్ లాంటి ప్రముఖ నటుడు విడుదల చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. అంటే, ఈ రెండు సినిమాలు ఐదు సినీ పరిశ్రమల మార్కెట్‌ను టార్గెట్ చేశాయి. ఇదిలా ఉంటే, ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకతో ‘సాహో’ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో అత్యంత భారీ వేడుకగా ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే, ఈ వేడుకను మించి ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ప్లాన్ చేయాలని నిర్మాత చూస్తున్నారట. ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను స్ఫూర్తిగా తీసుకుని దాని కంటే భారీ స్థాయిలో ‘సైరా’ వేడుకను నిర్వహించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మెగా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పోలిస్తే ప్రభాస్ అభిమాన గణం తక్కువనే చెప్పాలి. ‘సాహో’ వేడుకకు సుమారు లక్షమంది అభిమానులు హాజరయ్యారు. అలాంటిది, ‘సాహో’కు మించి ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకను జరిపితే మెగా అభిమానులు ఏ స్థాయిలో హాజరవుతారో ఊహించుకుంటేనే భయమేస్తుంది. అవకాశం ఇవ్వాలి కానీ అభిమానులు ‘మెగా పవర్’ ఏంటో చూపించేస్తారు. వచ్చే నెలలో ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తారని తెలుస్తోంది. తొలుత విజయవాడ లేదా తిరుపతిలో ఈ వేడుకను నిర్వహించాలని అనుకున్నారట. కానీ, ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తరవాత హైదరాబాద్‌లోనే జరపాలని చరణ్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఇటీవలే ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో చరణ్ సంప్రదింపులు జరిపారట. కొత్త ఐడియాలతో రావాలని వారికి సూచించారని సమాచారం. ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్ మీడియా నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, ‘సైరా’ టీజర్‌ను నేడు (ఆగస్టు 20న) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZgZsby

వైరల్ వీడియో: ‘ఓన్లీ వన్స్ ఫసక్’ అంటోన్న బన్నీ కూతురు

దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనతికాలంలోనే ప్రేక్షకులకు ఫేవరెట్ స్టార్ అయిపోయారు. స్టైలిష్ స్టార్‌గా దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. షూటింగులతో ఎప్పుడూ బిజీగా ఉంటే అల్లు అర్జున్.. సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటారు. ముఖ్యంగా పిల్లలు అయాన్, అర్హలతో ఆడుకుంటుంటారు. తాజాగా కుమార్తె అర్హతో అల్లు అర్జున్ ఆడుకుంటున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఫేమస్ డైలాగ్ ‘ఫసక్’ను అల్లు అర్జున్ తన గారాలపట్టితో చెప్పించారు. అర్హ ఎంతో ముద్దుముద్దుగా ‘ఓన్లీ వన్స్ ఫసక్’ అంటూ దువ్వెనతో తన తండ్రిని సరదాగా బెదిరిస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో..!! అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు. ‘క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్’ అంటూ తెగ మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ డ్రామాను చేస్తున్నారు. ‘అల.. వైకుంఠపురములో..’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఇది అల్లు అర్జున్‌కు 19వ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. నివేతా పేతురాజ్, టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z4r08X

నాకు యాక్సిడెంట్ కాలేదు.. అది నా కారు కాదు: హీరో తరుణ్

ఒకప్పటి లవర్ బోయ్, ప్రముఖ నటుడు కారు ప్రమాదానికి గురయ్యారని, ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని మంగళవారం ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబరుతో ఉన్న వోల్వో లగ్జరీ కారు రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొట్టి అదుపు తప్పింది. ఈ కారులో హీరో తరుణ్ ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారని, కారును ప్రమాద స్థలంలో ఆయన వదిలిపెట్టి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, ఆ కారు అసలు తరుణ్‌ది కాదని తేలింది. ఈ కారు ప్రమాదంపై నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గరైన కారు లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందని చెప్పారు. కారులో హీరో తరుణ్ లేరని స్పష్టం చేశారు. ఆ కారు తరుణ్‌ది కాదని ఆయన తల్లి రోజా రమణి కూడా వెల్లడించారని తెలిపారు. అయితే, యాక్సిడెంట్ సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కారు యజమాని ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రమాదానికి గురైన కారు తనది కాదని హీరో తరుణ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం టీవీ9 న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఆ కారు తనది కాదని చెప్పారు. తాను ఇంట్లోనే ఉన్నానని, ఉదయం నుంచి తనకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు. తాను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి స్నేహితులు, యూఎస్‌లో ఉన్న ఆప్తమిత్రులు తనకు ఫోన్లు చేస్తున్నారని, అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని తరుణ్ చెప్పారు. టీవీలో ఈ న్యూస్ చూసి తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. అసలు తనకు వోల్వో కారు లేదని.. తాను జాగ్వార్, స్కోడా కార్లు వాడుతున్నానని స్పష్టం చేశారు. మీడియా నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుందని, ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రసారం చేయొద్దంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31P2LZb

Kodali Nani Strong Warning To Babu



from VIDEOS – Tollywood https://ift.tt/2TG6NjQ

Rashmi Gautam Stills

Rashmi Gautam

Photography: Sandeep Gudala

Photography: Ekor

Photography: Ekor

Photography: Ekor

Photography: Sandeep Gudala

Photography: Sandeep Gudala

Photography: Sandeep Gudala



from GALLERY – Tollywood https://ift.tt/2TCPeBl