మరోసారి తెరను పంచుకుంటున్న చిరంజీవి, రామ్ చరణ్!

మెగాస్టార్ తన 152వ సినిమాను దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన కొరటాల శివ.. చిరంజీవితో సినిమా చేస్తున్నారనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభమవుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ అతిథి పాత్రలో నటించనున్నారట. ఇది ఒక మంచి సందేశంతో కూడి కమర్షియల్ సినిమా అట. దీనిలో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను రామ్ చరణ్‌తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు కొరటాల భావించారట. దీనికి రామ్ చరణ్ కూడా అంగీకారం తెలిపారని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. గతంలో ‘మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెం.150’ సినిమాల్లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి నటించారు. కాగా, ప్రస్తుతం దర్శకుడు హీరోయిన్ వేటలో ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కొరటాల మాత్రం ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నారట. ఆ విధంగా ప్రయత్నాలు కూడా మొదులుపెట్టారని అంటున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గనున్నారట. దీనికోసం ఆయన విశాఖపట్నం వెళ్తున్నారని సినీ వర్గాల సమాచారం. అక్కడ ఫిట్‌నెస్‌కి సంబంధించిన కసరత్తులు చేస్తారట. ఇక, చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K4gbuk

దయచేసి హార్దిక్ పాండ్య మాజీ ప్రేయసి అని అనకండి.. నాకూ కుటుంబం ఉంది!

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకు ముడిపెడుతూ యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఊర్వశిని మాజీ ప్రేయసి అని పేర్కొంటూ ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోను చూసిన ఊర్వశి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. తన ప్రతిష్ఠను దిగజార్చే ఇలాంటి వీడియోలను దయచేసి పోస్ట్ చేయొద్దంటూ యూట్యూబ్ ఛానెళ్లను ఊర్వశి వేడుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అలాంటి ఒక వీడియో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఇలాంటి వీడియోల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతారని పేర్కొంది. ఆ వీడియో స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉంచిన ఊర్వశి.. ‘‘యూట్యూబ్‌లో ఉన్న మీడియా ఛానెల్స్‌కు నేను ఎంతో విధేయతతో విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి చెత్త వీడియోలను అప్‌లోడ్ చేయడం మానేయండి. నాకొక కుటుంబం ఉంది, వాళ్లకు నేను సమాధానం చెప్పుకోవాలి. ఈ వీడియోలు నాకు సమస్యలు తెచ్చిపెడతాయి’’ అని పేర్కొన్నారు. ఒక సహాయం నిమిత్తం తన మాజీ ప్రియుడు, క్రికెటర్ హార్దిక్ పాండ్యాను కలిశారని ఆ వీడియోలో ఉంది. ఇదొక హిందీ మీడియా సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్. కాగా, కిందటేడాది ఊర్వశి, హార్దిక్ పాండ్య ఒక పార్టీకి కలిసి వెళ్లారు. పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా ముంబైలోని తన బ్రీచ్ క్యాండీ హోమ్‌లో ఈ పార్టీ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య కూడా ఈ పార్టీకి వచ్చాడు. అయితే, పార్టీలో హార్దిక్ పాండ్యతో ఊర్వశి సన్నిహితంగా మెలగడంతో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం హార్దిక్ ‘మికీ వైరస్’ నటి ఎల్లి అవ్‌రామ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GBDoSG

ప్రభాస్, శ్రద్ధా కపూర్.. మధ్యలో మహేష్.. ఫ్యాన్స్ అప్సెట్!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా కపూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా కపూర్‌ను తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరని అడిగారు. వెంటనే శ్రద్ధా సూపర్ స్టార్ పేరు చెప్పారు. ప్రభాస్ గురించి అడిగినప్పుడు అతను తనకు మంచి స్నేహితుడని వెల్లడించారు. శ్రద్ధా కపూర్ ఇచ్చిన ఈ సమాధానాలు ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి లోను చేశాయట. వాస్తవానికి ఒక హీరోతో నటిస్తున్నప్పుడు ఆయనే తన అభిమాన నటుడని హీరోయిన్ చెప్పాలని ఆ హీరో అభిమానులు కోరుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. శ్రద్ధాకపూర్ మహేష్‌బాబును ఇష్టపడుతున్నంత మాత్రాన ప్రభాస్ క్రేజ్ ఏమైనా తగ్గిపోతుందా? కానీ, శ్రద్ధా కపూర్ చెప్పిన సమాధానం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. కాగా, ‘సాహో’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ విడుదల చేస్తున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి పాటలు అందిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, లాల్, చంకీ పాండే, మందిరా బేడి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LNuGoB

Hebah Patel Latest Pics

Hebah Patel

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram



from GALLERY – Tollywood https://ift.tt/2K5zuCq

‘పెద్దన్న’కు భయపడిన నిఖిల్.. ‘అర్జున్ సురవరం’ ఇప్పట్లో రాదు!

హీరోగా సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. కిందటేడాది ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్.. దాని తరవాత ‘ముద్ర’ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఇదే పేరుతో మరో సినిమా రావడంతో వివాదమైంది. మొత్తం మీద టైటిల్‌ను మార్చి ‘అర్జున్ సురవరం’గా విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తేదీకి సినిమా విడుదల కాలేదు. అదే టైమ్‌లో ‘అవెంజర్స్’ విడుదలవుతుండటంతో వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ విడుదల తేదీని మాత్రం ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఏదో ఒక కారణం చూపుతూ వాయిదా వేస్తూ వస్తున్నారు. మే 9న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ విడుదల కావడంతో ఆ సమయంలో ‘అర్జున్ సురవరం’ను విడుదల చేసే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ‘సాహో’కు భయపడుతున్నారు. ఆ సినిమా విడుదలైన తరవాతే ‘అర్జున్ సురవరం’ను విడుదల చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ సిద్ధార్థ వెల్లడించారు. ‘అర్జున్ సురవరం’ కోసం వేచిచూస్తోన్న ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా నిఖిల్‌ను ప్రశ్నించారు. ‘16 నెలలు అవుతుంది అన్న నీ మూవీ కిర్రాక్ పార్టీ రిలీజ్ అయ్యి.. అర్జున్ సురవరం కోసం వెయిటింగ్’ అని నిఖిల్‌ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నిఖిల్ స్పందించారు. ‘నిరీక్షణకు ప్రతిఫలం దక్కుతుంది. పెద్దన్న ‘సాహో’ తరవాత ‘అర్జున్ సురవరం’ విడుదల ఉంటుంది’ అని ట్వీట్‌లో నిఖిల్ పేర్కొన్నారు. ఇలా ఎప్పటి వరకు వాయిదా వేసుకుంటూ వెళ్తారో అర్థం కావడంలేదు. వాస్తవానికి ఈ సినిమాపై నిఖిల్‌కు చాలా నమ్మకం ఉంది. స్టూడెంట్స్ కోసం పోరాడే జర్నలిస్ట్ అర్జున్ సురవరం కథ ఇది. సినిమాపై నిఖిల్‌కు ఉన్న నమ్మకం డిస్ట్రిబ్యూటర్లకు లేనట్టుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తొలిసారి నిఖిల్ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. విడుదలయ్యే ప్రతి సినిమాకు భయపడితే ఇంకెప్పుడు విడుదల చేస్తారు ఈ ‘అర్జున్ సురవరం’ను అనే మాట ప్రేక్షకుల నుంచి రాకముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచిది. కాగా, ‘సాహో’ ఆగస్టు 30న విడుదలవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MlXc08

దిల్ రాజుతో చిరంజీవి సినిమా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి అద్భుతమైన సినిమాలు తీశారాయన. దిల్ రాజు సినిమా అంటే హిట్టు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, యువ హీరోలందరితోనూ సినిమాలు చేశారు దిల్ రాజు. అయితే, టాలీవుడ్‌కు నాలుగు పిల్లర్లుగా చెప్పుకునే మెగాస్టార్ , నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లలో ఇద్దరితో మాత్రమే దిల్ రాజు సినిమాలు చేశారు. అక్కినేని నాగార్జునతో ‘గగనం’ వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు.. వెంకటేష్‌తో ‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించారు. చిరంజీవి, బాలకృష్ణతో కూడా సినిమాలు నిర్మించాలని దిల్ రాజు కోరికట. అయితే, వీటిలో ఒక కోరిక తీరబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజుతో సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి అంగీకరించారట. ఇటీవల చిరంజీవిని దిల్ రాజు కలిశారని, సినిమా చేయాలని కోరుకుంటున్న విషయాన్ని ఆయనతో చెప్పారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. దిల్ రాజు కోరిక పట్ల చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారట. చిరంజీవి తరవాత సినిమా (153వ సినిమా)ను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. చిరంజీవి ఇటీవలే ‘సైరా’ షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 152వ చిత్రం కోసం చిరంజీవి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JZSP9s

Kajal Aggarwal Latest Pics

Kajal Aggarwal

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram



from GALLERY – Tollywood https://ift.tt/2ydWPfG

Sonal Chauhan Latest Pics

Sonal Chauhan

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram



from GALLERY – Tollywood https://ift.tt/2OnCfV1

See Ambati Rambabu Funny Comments On Chandhrababu



from VIDEOS – Tollywood https://ift.tt/2YpwVjC

Sunitha Boya Shocking Comments On Chiranjeevi



from VIDEOS – Tollywood https://ift.tt/30WHFHX

పుల్లేటుకుర్రులో మోక్షజ్ఞతో కలిసి బాలయ్య ప్రత్యేక పూజలు.. కారణం ఇదే!

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని పుల్లేటికుర్రు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులోని చౌడేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో తనయుడు మోక్షజ్ఞతో కలిసి బాలయ్య గురువారం ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో కొత్త సినిమా ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం చేయించారు. పుల్లేటికుర్రుకు చెందిన ప్రముఖ వేద పండితులు, బాలకృష్ణ ఆధ్యాత్మిక గురువు కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు,హోమాలు అభిషేకాలు నిర్వహించారు. కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతిగారి జ్యోతిషం అంటే బాలయ్యకు అపార నమ్మకం. తాను ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయన సలహా తీసుకుంటారు. కుమార్తెల వివాహాల విషయంలో ఆయన సూచనలు, సలహాలను పాటించారని అంటారు. బాలకృష్ణ తన కొత్త చిత్రం ప్రారంభించే ముందు ఇక్కడకు వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. బాలయ్య ఇక్కడికి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు సిద్ధాంతి ఇంటి వద్దకు కూడా అభిమానులు, ప్రజలను అనుమతించలేదు. పుల్లేటికుర్రు చౌడేశ్వరి ఆలయంలో అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు పూజలు నిర్వహిస్తారు. ఏకాదశ రుద్రుల్లో ఒకరైన అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ఈ గ్రామంలో ఉండేవారి అంటారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OmH54P

కన్నడ కస్తూరి రష్మిక మందన ఇంటర్వ్యూ

కన్నడ కస్తూరి రష్మిక మందన ఇంటర్వ్యూ




from Telugu Samayam https://ift.tt/2YuQyLe

‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

బాబీ అనే ఓ స్టూడెంట్ లీడర్ ఎమోషనల్ జర్నీ. ఇందులో లిల్లీ అనే అమ్మాయి ఎలా భాగస్వామ్యం అయ్యింది. వీరిద్దరి ప్రయాణం .. వారి జీవితంలో వచ్చిన సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే ‘డియర్ కామ్రేడ్’ కథ

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2SHV3g5

‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

బాబీ అనే ఓ స్టూడెంట్ లీడర్ ఎమోషనల్ జర్నీ. ఇందులో లిల్లీ అనే అమ్మాయి ఎలా భాగస్వామ్యం అయ్యింది. వీరిద్దరి ప్రయాణం .. వారి జీవితంలో వచ్చిన సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే ‘డియర్ కామ్రేడ్’ కథ

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2SHV3g5

‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

బాబీ అనే ఓ స్టూడెంట్ లీడర్ ఎమోషనల్ జర్నీ. ఇందులో లిల్లీ అనే అమ్మాయి ఎలా భాగస్వామ్యం అయ్యింది. వీరిద్దరి ప్రయాణం .. వారి జీవితంలో వచ్చిన సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే ‘డియర్ కామ్రేడ్’ కథ

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2SHV3g5

‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

బాబీ అనే ఓ స్టూడెంట్ లీడర్ జర్నీలో లిల్లీ ఎలా కలిసింది? వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వారి జీవితంలో ఎదురైన సమస్యలు ఎలా ఎదుర్కొన్నారు అన్నదే ఈ చిత్ర కథ.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2Y60WcZ

‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

బాబీ అనే ఓ స్టూడెంట్ లీడర్ జర్నీలో లిల్లీ ఎలా కలిసింది? వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వారి జీవితంలో ఎదురైన సమస్యలు ఎలా ఎదుర్కొన్నారు అన్నదే ఈ చిత్ర కథ.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y60WcZ

‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

బాబీ అనే ఓ స్టూడెంట్ లీడర్ జర్నీలో లిల్లీ ఎలా కలిసింది? వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వారి జీవితంలో ఎదురైన సమస్యలు ఎలా ఎదుర్కొన్నారు అన్నదే ఈ చిత్ర కథ.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2Y60WcZ

‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

బాబీ అనే ఓ స్టూడెంట్ లీడర్ జర్నీలో లిల్లీ ఎలా కలిసింది? వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వారి జీవితంలో ఎదురైన సమస్యలు ఎలా ఎదుర్కొన్నారు అన్నదే ఈ చిత్ర కథ.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2Y60WcZ

‘డియర్ కామ్రేడ్’ ట్విట్టర్ రివ్యూ: సూపర్ హిట్ కానీ..!

సెన్సేషనల్ స్టార్ , కన్నడ బ్యూటీ మరోసారి జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రం ద్వారా భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కన్నడ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణానికి ఏడాదికిపైగా సమయం పట్టింది. అయినప్పటికీ విజయ్‌కు ఉన్న క్రేజ్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్, రష్మిక రెండోసారి కలిసి నటించడం.. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతంగా ఉండటంతో సినిమా ఎప్పుడొప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఆ రోజు వచ్చేసింది. శుక్రవారం (జూలై 26న) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) ఒకేసారి విడుదలైంది. అమెరికాలోనూ భారీ ఎత్తున ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటన సినిమాకు ప్రధాన బలమని.. వెండితెరపై వీళ్లిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని కొనియాడుతున్నారు. దర్శకుడు భరత్ కమ్మ తొలిచిత్రంతోనే ఆకట్టుకున్నారట. నెరేషన్ చాలా బాగా చేశారని అంటున్నారు. కాకపోతే, ఆ నెరేషన్ చాలా నెమ్మదిగా సాగిందని అభిప్రాయపడుతున్నారు. ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ సాగదీసినట్టు ఉందని ట్వీట్లు చేస్తున్నారు. సినిమా మరీ కమర్షియల్ రేంజ్‌లో లేదని.. కానీ, ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఒక్కసారి చూడదగిన సినిమా అంటూ కొందరు వెల్లడించారు. సినిమా సూపర్ హిట్ అని, అందులో తిరుగేలేదని కొందరు ట్వీట్లు చేస్తు్న్నారు. ‘కడలల్లే’ పాట అయితే ప్యూర్ గోల్డ్ అంటూ కొనియాడుతున్నారు. ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు లేకపోవడం, కాస్త స్లోగా, లెంగ్తీగా ఉండటం తప్ప సినిమాకు పెద్దగా మైనస్‌లు లేవని చెబుతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయని టాక్. మొత్తంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ మరో హిట్ కొట్టేసినట్టే. సినిమా కాస్త స్లోగా ఉన్నా.. విజయ్, రష్మిక పెర్ఫార్మెన్స్‌ల ముందు అది పెద్దగా కనిపించదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LIENen

Payal Rajput Latest Pics

Payal Rajput

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram



from GALLERY – Tollywood https://ift.tt/2LGeYvj

విజయ్‌తో సినిమా చేయొద్దన్నారు.. ఇంట్లో ఫైట్ చేసి వచ్చా: రష్మిక

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ .. రెండో సినిమా ‘గీత గోవిందం’తో వారికి బాగా దగ్గరైపోయారు. ఆ వెంటనే ‘దేవదాస్’లో నాని సరసన నటించి మెప్పించారు. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’తో కలిసి వస్తున్నారు. విజయ్ దేవరకొండతో రెండోసారి కలిసి నటించిన రష్మిక.. బుధవారం రాత్రి జరిగిన ‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని తన జీవితంలో చేసిన ఫైట్ గురించి వివరించారు. ‘అమ్మా, నాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. వీళ్లందరితో ఫైట్ చేసి సినీ పరిశ్రమకు వచ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లకు, అది చాలా చెడ్డది, అక్కడ అమ్మాయిలకు భద్రత ఉండదు అని అన్నారు. కానీ, వచ్చాను. సినిమాల్లో నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయినా నిలబడ్డా’ అని తన ఫైట్ గురించి వెల్లడించారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘భరత్ సార్ స్క్రిప్ట్ పంపినప్పుడు నాకు అది పిచ్చిగా నచ్చింది. కచ్చితంగా ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయా. కానీ, ఈ సినిమాలో చేయడానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇంట్లో చాలా ఫైట్ చేశా. విజయ్‌తో ఇంకో సినిమా ఎందుకు, చేయొద్దు అని ఇంట్లో అన్నారు. ఇక్కడ ఎవరితో చేస్తున్నానని కాదు విషయం.. ఈ స్క్రిప్టు చేయాలి అంతే అని చెప్పా’ అని తన ఫ్యామిలీతో చేసిన ఫైట్ గురించి రష్మిక వివరించారు. ‘డియర్ కామ్రేడ్’ కోసం తాను క్రికెట్ ప్రాక్టీస్ చేశానని ఇప్పటికే రష్మిక చెప్పారు. అయితే, దాని కోసం తాను ఎంత ఫైట్ చేశానో ప్రీ రిలీజ్ వేడుకలో రష్మిక చెప్పుకొచ్చారు. ‘సినిమా ప్రారంభానికి ముందు నాలుగు నెలలు నేను క్రికెట్ ప్రాక్టీస్ చేశాను. నా భుజానికి, కాలి చీలమండకు గాయాలయ్యాయి. ఆ సమయంలో నేను నా బాడీతో ఫైట్ చేశాను. నేను కచ్చితంగా చేయాలని కష్టపడ్డాను. నా కష్టాన్ని ఈరోజు మీరు ట్రైలర్‌లో చూస్తున్నారు. క్రికెట్ కోసం నేను చేసిన హార్డ్ వర్క్ అది’ అని రష్మిక చెప్పారు. కష్టాలకు ఎవ్వరూ భయపడొద్దని, మీకు నచ్చిన పని చేయడానికి ఫైట్ చేయండని రష్మిక అభిమానులకు సూచించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z6DzMW

‘మన్మథుడు 2’ ట్రైలర్: వామ్మో.. లిప్‌లాకులు!!

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ముఖ్యంగా ఆ కాలం అమ్మాయిలైతే అస్సలు మరిచిపోరు. ఎందుకంటే, ఈ సినిమాతో నాగార్జున మన్మథుడికి కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. ఆయన అందం, పంచ్ డైలాగులు, కామెడీ ఇవన్నీ ‘మన్మథుడు’ సినిమాకు ప్రధాన బలాలు. ఆ సూపర్ హిట్ సినిమాను తలపిస్తూ సుమారు 17 ఏళ్ల తరవాత ఇప్పుడు ‘మన్మథుడు 2’ను తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లిన మన్మథుడిగా కనిపించబోతున్నారు. ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాపై ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ట్రైలర్. నాగార్జున స్టైల్లో రొమాన్స్, వెన్నెల కిషోర్, రావు రమేష్ కామెడీ, మనసుకు హత్తుకునే ఎమోషనల్ డ్రామా ఇవన్నీ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. ఆ మన్మథుడు మాదిరిగానే ఈ ‘మన్మథుడు 2’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించేలా కనిపిస్తున్నాడు. ‘అద్భుతం.. అమోఘం.. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. హమ్మీ గో..’ అంటూ కారులో వెన్నెల కిషోర్ పక్కన కూర్చొని మంచి జోష్‌తో నాగార్జున చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. ‘మీరెప్పుడూ ప్రేమలో పడలేదా?’ అని రకుల్ అడిగితే.. ‘ఒకపూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను’ అంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు నాగ్. ‘ఏ అమ్మాయి బాగానే ఉన్నావుగా.. ఈడ్ని చేసుకుంటున్నావేంటి? ఏ కేస్టు’ అంటూ రావు రమేష్ వెటకారంగా విసిరే పంచ్ డైలాగులు ట్రైలర్‌లో మరో హైలైట్. ఈ పాత్ర చూస్తుంటే రావు రమేష్ మరోసారి తన వెటకారంతో కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తున్నారు. ఇవన్నీ పక్కనపెడితే.. 50 పైబడిన వయసులోనూ నాగ్ రొమాన్స్ ఆడియన్స్‌ను పిచ్చెక్కించడం ఖాయం. విదేశీ భామలతో ఆయన లిప్‌లాకులు కూడా చేసేశారు. మొత్తంగా చూసుకుంటే ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్.. ఈ సినిమాతో వరుసగా రెండో హిట్టు కొట్టేలా ఉన్నారు. ఆయన సినిమాను చాలా బాగా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. కాగా, ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత చిన్న అతిథి పాత్రలు పోషించారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్టు 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OhlLh4

Manmadhudu 2 Theatrical Trailer



from VIDEOS – Tollywood https://ift.tt/2Y4pqU4

Manmadhudu 2 Theatrical Trailer



from TOPSTORIES – Tollywood https://ift.tt/2Y4pqU4

ప్రముఖ కవి, దర్శకుడు మోహనకృష్ణ తండ్రి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు

దర్శకుడు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ కవి, సాహితీవేత్త కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న శ్రీకాంత శర్మ.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 1944 మే 29న జన్మించారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి 20 ఏళ్ల పాటు సేవలందించారు. అనేక లలిత గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలను రచించారు. అలాగే ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ఉప సంపాదకుడిగా, ‘ఆంధ్రప్రభ’ పత్రికకు సంపాదకుడిగా చాలాకాలం పనిచేశారు. పలు తెలుగు సినిమాల్లో పాటలు రాశారు. ‘కృష్ణావతారం’, ‘నెలవంక’, ‘రావుగోపాలరావు’, ‘రెండుజెళ్ల సీత’, ‘పుత్తడిబొమ్మ’, ‘చైతన్యరథం’ వంటి చిత్రాల్లో శ్రీకాంత శర్మ పాటలు రాశారు. తన కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాలోనూ ఆయన పాటను రచించారు. శ్రీకాంత్ శర్మ 1966లో సుప్రసిద్ధ కథారచయిత్రి జానకీబాలను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. కుమార్తె కిరణ్మయి కూడా డాక్యుమెంటరీ, లఘుచిత్రాలు తీసి అవార్డులు పొందారు. ఈమె మోహనకృష్ణ కంటే పెద్దవారు. కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది. కాగా, శ్రీకాంత్ శర్మ మృతికి సంతాపం తెలుపుతూ హీరో నాని ట్వీట్ చేశారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయనొక మేధావి అని, గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అష్టా చమ్మా’ సినిమాను చూసిన తరవాత మోహన్ గారితో పాటు తామందరనీ చూసి ఆయన ఎంత గర్వపడ్డారో ఇప్పటికీ మరిచిపోలేనని అన్నారు. మోహనకృష్ణ గారికి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, హీరో సిద్ధార్థ్ కూడా ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YiduJs

Dhoni Run Out: అప్పుడు నా గుండె ఆగినంత పనైంది: రష్మిక మందన

విజయ్ దేవరకొండ, కన్నడ భామ జంటగా రెండోసారి నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 26న (శుక్రవారం) ‘డియర్ కామ్రేడ్’ థియేటర్లలో సండడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్లనో భాగంగా రష్మిక మాట్లాడుతూ.. ‘సినిమాలో నేను క్రికెటర్‌గా కనిపిస్తాను. అందుకోసం క్రికెట్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. స్టేట్ లెవల్ క్రికెటర్‌గా కనిపిస్తాను. బ్యాటింగ్‌లో ఫోర్ కొట్టడం, అలాగే వికెట్లు కాపాడుకోవడం ఇప్పుడు నాకు తెలుసు. సినిమాల్లో బ్యాట్ పట్టుకుంటూనే నాకిలా అనిపిస్తుంది. అలాంటిది వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎంఎస్ ధోనీ పరిస్థితిని మనం ఊహించలేం. ఆ మ్యాచ్‌లో ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడం నన్ను బాధించింది. రనౌట్ అయ్యాడని అంపైర్ ప్రకటించగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. మనకే అలా ఉంటే మైదానంలో ఉండేవారికి, రనౌట్ అయిన ధోనీకి ఇంకెలా ఉంటుందో అర్థమైంది. Also Read: డియర్ కామ్రెడ్ మూవీలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. భాష రాకపోయినా తెలుగు మాటలు నేర్చుకుని డబ్బింగ్ చెప్పేశా. రెండు నెలల సమయం ఇందుకోసం శ్రమించా. మూవీ విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని’ నటి రష్మిక ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2y7uHuv

Nani’s Gang Leader Teaser



from VIDEOS – Tollywood https://ift.tt/2JWyj8i

Nani’s Gang Leader Teaser



from TOPSTORIES – Tollywood https://ift.tt/2JWyj8i

Nidhhi Agerwal Romantic Stills

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram



from GALLERY – Tollywood https://ift.tt/2M5EU2P