శ‌ర్వానంద్ హీరోగా మరో చిత్రానికి ‘శ్రీకారం’

హీరో మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘శ్రీకారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా.. ఎన్నారై శ‌శికాంత్ వ‌ల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మాటల రచయిత సాయిమాధ‌వ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించ‌గా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగ‌స్ట్ మొద‌టి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. ఇంకా హీరోయిన్లను ఖరారు చేయలేదు. పూర్తి తారాగణాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. కాగా, శర్వానంద్ హీరోగా నటిస్తోన్న మరో చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా శర్వానంద్‌కు గాయమైంది. దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పటకే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. గుబురు గెడ్డంతో ఆయన లుక్ అదిరిపోయింది. శర్వా సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘స్వామి రారా’ సినిమాతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xa5iKZ

‘ఓ బేబీ’ సరికొత్త ప్రయోగం.. సామ్ అదరగొట్టింది: వెంకటేశ్

‘ఓ బేబీ’లాంటి కథలు ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలని అన్నారు విక్టరీ వెంకటేశ్. కీలకపాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేశ్, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జులై 5న ‘ఓ బేబీ’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. సినిమా మామూలుగా లేదు. సమంత సినీ జీవితంలోనే ఇది అత్యుత్తమ చిత్రం అనుకోవచ్చు. ఇలాంటి కథను ఎంచుకుని సినిమాగా తెరకెక్కించినందుకు డైరెక్టర్ నందినీరెడ్డిని అభినందిస్తున్నా. బేబీ పాత్రలో సమంత అదరగొట్టేసింది. తెలుగులో ఇప్పటివరకు రాని కథ ఇది. నటీనటులంతా చాలా బాగా చేశారు’ అని మెచ్చుకున్నారు. రానా మాట్లాడుతూ.. తెలుగులో కొత్త తరహా సినిమాలు రావాలని కోరుకునే వాళ్లలో నేనూ ఉంటా. బేబీ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్‌లో కొత్త శకం ప్రారంభమైంది. ఇలాంటి సినిమాలు ప్రతి వారం రావాలి. బేబీగా సమంత నటన సూపర్బ్’ అని అన్నారు. సమంతకూ, లక్ష్మికీ నేనే బోయ్‌ఫ్రెండ్‌ని: రాజేంద్రప్రసాద్ ‘‘ఓ బేబీ’లో నటిస్తుంటే హాలీవుడ్ సినిమాలో నటించిన ఫీలింగ్ కలిగింది. మంచి పాత్రలు ఎంపిక చేసుకోవడం వల్లే ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో కొనసాగగలిగా. ‘అహనా పెళ్లంట’ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నటించే అవకాశం వచ్చింది. గతంలో నేనే నటించిన పాత్రలన్నీ ఒక ఎత్తయితే ‘ఓ బేబీ’లో పాత్ర మరో ఎత్తు. ఈ సినిమాలో లక్షీకి, సమంతకు నేనే బాయ్‌ఫ్రెండ్‌ని’


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YkJvl2

Sai Dharam Tej PratiRoju Pandaage Movie Making



from VIDEOS – Tollywood https://ift.tt/2XhSTcI

Brochevarevarura



from TMDB : TeluguOne Movie Database https://ift.tt/322EC2y

Brochevarevarura

Story :

Cast: Sri Vishnu, Niveditha Thomas, Nivetha Pethuraj

Music: Vivek Sagar

Cinematography: Sai Sriram

Producers: Vijay Kumar Manyam

Story, Screenplay Direction: Vivek Athreya

Release Date: 28th June 2019

Director Vivek Athreya Sri Vishnu were introduced with the movie Mental Madilo. Again the duo have come together to make Brochevarevarura. As long as Sri Vishnu is seen on screen, Rahul Ramakrishna Priyadarishini will also be seen on screen, such important is their character in the movie. Now let us see how has the movie performed!

Story:

Rahul(Sri Vishnu), Rocky (Priyadarshini) Rambo (Rahul Ramankrishna) are 3 friends who have been studying in a college for 5 years. Principals daughter (Nivedita Thomas) joins the college. What did she all the 3 friends do together in college? What kind of problem did they face? How did they get out of it? Answer to all this questions forms the movie story Brochevarevarura.

Analysis :

The caption of the movie is very interesting. People who have already watched the movie will understand that. But for those who have not seen, please remember to see the caption! It will give a nice twist to the story. Though there is not much to tell about the story, the comedy timings are just too good. And this comedy has saved the movie.

Director has concentrated on characters rather than the story. He has concentrated on the small characters as well.

Plus Points:

Entertainment

Cast

Songs

Twists in the story

Minus points:

Slow narration

Lack of strong story

Background music

Performances:

Rahul, Srivishnu Priyadarshini have all acted as required. The chemistry comedy timing between the trio worked well. Nivedita has done a great job. But this is not a challenging role for her. All the others have done their bit well.

TeluguOne Perspective :

This is not a very impressive or a new story but the comedy timing in the movie is just too good. All the actors have given their best



from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2LubIST

Dear Comrade: ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే...’ సాంగ్ ప్రోమో

‘గీతాగోవిందం’ సూపర్‌హిట్ తర్వాత , రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు భ‌ర‌త్ క‌మ్మకు ఇదే తొలిచిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈ సినిమా నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటోంది. జులై 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పాటలను యూట్యూబ్‌ ద్వారా యూనిట్ విడుదల చేసింది. వీటిలో ‘కడలల్లే వేచె కనులే’, ‘గిర గిర గిర’, పాటలు యూత్‌ను ఊపేస్తున్నాయి. అయితే సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు పక్కా యూత్ సాంగ్‌ను సిద్ధం చేశారు మ్యూజిక్ డైరెక్టర్. దీనికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెను..’ అంటూ సాగే పల్లవిని నాలుగు భాషల్లో యూనిట్ సభ్యులతో పాడించారు. ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్‌ను రెడీ చేస్తుండగా యూనిట్ సభ్యులు వచ్చి ఏం సాంగ్ చేస్తున్నారు సార్ అని అడుగుతారు. దానికి ఆయన మరో మెలోడీ చేస్తున్నా అని సమాధానం ఇస్తారు. ఇప్పటికి కంపోజ్ చేసిన పాటలన్నీ మెలోడీయే అని.. మళ్లీ మెలోడీయే చేస్తే ఎవరు చూస్తారని వారు అసహనం వ్యక్తం చేస్తారు. అదే సమయంలో ఆ రూమ్‌లోకి వచ్చిన విజయ దేవరకొండకు ఈ విషయం చెప్పినా ఆయన లైట్ తీసుకుని ఫోన్ వస్తే మాట్లాడేందుకు బయటకు వెళ్లిపోతారు. అయితే యూనిట్ సభ్యులంతా ఒత్తిడి చేయడంతో మ్యూజిక్ డైరెక్టర్ కాలేజీ నేపథ్యంలో ఓ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేస్తారు. ఈ పాట పల్లవిని కన్నడలో రష్మిక పాడగా.. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఒక్కొక్కరు పాడారు. అదే సమయంలో ‘ఈ సాంగ్‌లో నేను లేనుగా.. ఇక్కడెందుకు కూర్చున్నాను’ అనుకుంటూ రష్మిక బిత్తర చూపులు చేస్తూ ఉండటం ఫన్నీగా ఉంది. చివర్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సింగిల్ టేక్‌లో కొట్టినం... మజా వస్తది’ అంటూ వారితో కలిసి సందడి చేశారు. ఆ మేకింగ్ వీడియో మీరూ చూసేయండి..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X5PI2R

విజయనిర్మల అంతిమయాత్ర.. ఫిల్మ్ ఛాంబర్‌కు పార్థీవదేహం

బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన ప్రముఖ నటి అంత్యక్రియలు కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. ఆమె పార్థీవ దేహాన్ని తొలుత ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కాసేపు ఉంచి, మెయినాబాద్‌ మండలంలోని చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌‌కు తరలిస్తారు. అక్కడే విజయ నిర్మలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంతకు ముందు ఏపీ సీఎం జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ‌కృష్ణ, నరేశ్‌లను వీరంతా ఓదార్చారు. నానక్‌రామ్‌ గూడలోని ఆమె నివాసం నుంచి బంధులువు, అభిమానుల కన్నీటి మధ్య కడసారి యాత్ర మొదలైంది. ముందు ప్రకటించినట్టు ఉదయం 11.00 గంటలకే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా, కొంత ఆలస్యమైంది. మరోవైపు అంతిమయాత్రకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ నిర్మలతో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు. మరోవైపు, విజయ నిర్మల మరణవార్తను కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రాణం వదిలివెళ్లిపోయిందని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరంకావడంలేదు. విజయనిర్మల పార్థివదేహం వద్ద విలపిస్తునన కృష్ణను అలా చూసి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కృష్ణ గారిని అలా చూడలేకపోతున్నాం అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XDrlxO

విజయ నిర్మలకు నివాళులర్పించి కృష్ణను ఓదార్చిన జగన్

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవ దేహానికి ఏపీ సీఎం నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కోసం సీఎం జగన్ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం ఉదయం తన నివాసం లోటస్‌పాండ్‌‌ నుంచి నానక్‌రామ్‌గూడ‌లోని కృష్ణ నివాసానికి వెళ్లారు. ఉదయం 9గంటలకు విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించారు. విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్‌ వెంట , ఏపీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. కడసారి చూపు కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి తరలివస్తున్నారు. పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గత ఏడునెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్‌ గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 11గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం నేడు ఆమె పార్ధివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించి, అక్కడ కొద్ది సేపు ఉంచుతారు. తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి చిలుకూరులోని ఫాంహౌస్ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విజయ నిర్మల బహుముఖ ప్రతిభ చూపారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం 200 పైచిలుకు చిత్రాల్లో నటనతో మెప్పించారు. 44 చిత్రాలకి దర్శకత్వం వహించి, 15 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో తొలి చిత్రం మీనాతోనే ఘన విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా విజయనిర్మల ‘మచ్ఛరేఖై’ (1953) అనే తమిళ సినిమాలో తొలిసారి నటించిన విజయ నిర్మలకు వితెలుగులో తొలి చిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’. మలయాళంలో తొలి హారర్‌ చిత్రం ‘భార్గవి నిలయం’తో కథానాయికగా పరిచయమయ్యారు. తెలుగులో కథానాయికగా ‘రంగులరాట్నం’తో ఆమె ప్రస్థానం ప్రారంభమైంది. కవిత అనే మలయాళ చిత్రంతో ఆమె తొలిసారి దర్శకత్వం వహించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J9WYpv

‘బ్రోచేవారెవరురా’ ట్విట్టర్ రివ్యూ.. హిట్టు కొట్టేశారు!

సినిమా సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోన్న నటుడు శ్రీవిష్ణు. తన స్నేహితుడు నారా రోహిత్ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీవిష్ణు తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందిస్తున్నారు. కిందటేడాది ‘నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు.. ఈ ఏడాది కూడా ఓ వైవిధ్యమైన చిత్రంతో తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము - చిత్రమే చలనము’ అనేది ఉప శీర్షిక. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ కుమార్ మన్యం నిర్మించారు. సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పుడు కొత్తగా ఉందే అన్నారంతా. ఇక పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రచార కార్యక్రమాలతో సినిమాను బాగానే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. ప్రచార పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను పిలిచి సినిమా స్థాయిని పెంచారు. హీరో నాని కూడా సినిమా హిలేరియస్‌గా ఉందంటూ కితాబిచ్చారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో తొలి ప్రీమియర్ షో పడిపోయింది. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ అద్భుతంగా చేశారట. తమ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారని అంటున్నారు. కథనం కాస్త నెమ్మదిగా ఉన్నా మొత్తంగా సినిమా మాత్రం బాగుందని టాక్. కొంత మంది అయితే ఇప్పటి వరకు థియేటర్‌లో ఇంతలా తాము నవ్వలేదని ట్వీట్లు చేస్తున్నారు. కచ్చితంగా చూడాల్సిన సినిమా అని, మిస్ కావొద్దని సలహా ఇస్తున్నారు. మొత్తంమీద ‘బ్రోచేవారెవరురా’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ఇలాంటి టాక్ వచ్చిందంటే శ్రీవిష్ణు హిట్టుకొట్టినట్టే!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xgrTej

‘బ్రోచేవారెవరురా’: పొట్టచెక్కలవ్వాల్సిందే.. నాని ఫస్ట్ రివ్యూ

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న చిన్న హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆయన ప్రతి సినిమా ఒక కొత్త కథాంశమే.. ఒక ప్రయోగమే. ఈసారి కూడా డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా చిన్నదే అయినా దీనికి కల్పించిన ప్రచారంతో ప్రేక్షకుల్లో్ అంచనాలు పెరిగాయి. దీనికి తోడు మంచి తారాగణం తోడవడంతో ప్రేక్షకుల దృష్ణి ఈ సినిమాపై పడింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను కేవ‌లం ఆడ‌పిల్లల కోసం ఈ సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంట‌న్నది సినిమాలో చూడండి. న‌వ్వులు కూడా చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు’ అని వెల్లడించారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమా గురించి నేచురల్ స్టార్ కూడా చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడి పొట్టచెక్కలవడం ఖాయమట. ‘బ్రోచేవారెవరురా’ విడుదలకు ఒకరోజు ముందు అంటే గురువారం నాడు నాని ఈ సినిమాను చూశారు. చూసిన తరవాత తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘ఇప్పుడే ‘బ్రోచేవారెవరురా’ చూశాను. కచ్చితంగా విపరీతంగా నవ్విస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి కామెడీ రాలేదు. విష్ణు, నివి, సత్య, నివేతా పేతురాజ్, రాహుల్, దర్శి అందరూ అద్భుతంగా చేశారు. డైరెక్షన్, మ్యూజిక్‌తో ఇద్దరు వివేక్‌లు అదరగొట్టారు. రేపు విడుదలవుతోంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని తన ట్వీట్‌లో నాని పేర్కొన్నారు. కాగా, యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నారు. మరికాసేపట్లో టాక్ ఏంటో తెలిసిపోతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FEp3nV

‘కల్కి’ సినిమా రివ్యూ

ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సీరియస్ స్టోరీలైన్‌కు కాస్త కామెడీని జోడించి ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఎమ్మెల్యే తమ్ముడి హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేసే ఆఫీసర్‌గా రాజశేఖర్ కనిపిస్తారు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2NjMolh

‘కల్కి’ సినిమా రివ్యూ

ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సీరియస్ స్టోరీలైన్‌కు కాస్త కామెడీని జోడించి ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఎమ్మెల్యే తమ్ముడి హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేసే ఆఫీసర్‌గా రాజశేఖర్ కనిపిస్తారు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2NjMolh

‘కల్కి’ సినిమా రివ్యూ

ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సీరియస్ స్టోరీలైన్‌కు కాస్త కామెడీని జోడించి ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఎమ్మెల్యే తమ్ముడి హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేసే ఆఫీసర్‌గా రాజశేఖర్ కనిపిస్తారు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2NjMolh

విజయనిర్మల మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు, నిర్మాత మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నానక్‌రామ్ గూడలోని ఆమె నివాసంలో సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZRg0YC

అంతటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో చూడలేం: చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు మృతి పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల లాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని ఆయన అన్నారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. విజయనిర్మల లేని లోటు యావత్తు సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ‘అరుదైన దర్శక నటీమణి శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మన తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయనిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్‌ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్‌‌కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు, విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KEOoSO

కృష్ణ- విజయనిర్మల పెళ్లి .. రాజబాబు ముందే చెప్పారు!

సినీ పరిశ్రమలో నటీనటులు దంపతులుగా మారడం సాధారణమే. పాతకాలం నుంచి నేటి కాలం వరకు ఎందరో నటీనటులు జీవిత భాగస్వాములుగా మారడం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమ విషయానికొస్తే ఇక్కడా ఎన్నో జంటలు మనకు కనిపిస్తుంటాయి. వారిలో కృష్ణ-విజయ నిర్మల జంట మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇద్దరూ ప్రముఖ నటులే కావడం, ఎన్నో సినిమాల్లో జంటగా నటించడంతో అప్పట్లోనే వీరి వివాహం టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీ కట్టిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. Also Read: 1966లో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరుసటి ఏడాదే ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో జోడీ కట్టారు. ఇక్కడే వీరి ప్రేమకు బీజం పడి అది వివాహ బంధంగా బలపడింది. అయితే కృష్ణ-విజయనిర్మల వివాహం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. ప్రముఖ చిత్రకారుడు బాపు 1967లో ‘సాక్షి’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఇందులో కృష్ణ-విజయనిర్మల హీరోహీరోయిన్లు. ఈ సినిమా కోసం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పులిదిండి గ్రామంలో అవుట్‌డోర్ షూటింగ్ చేశారు. ఆ గ్రామంలోని ఆలయంలో కృష్ణుడికి మీసాలు ఉండటం ప్రత్యేకత. ఈ సినిమాలో నటించిన ప్రముఖ హాస్యనటుడు రాజబాబు ఆ జిల్లాకు చెందినవాడే కాబట్టి ఆ కృష్ణుడి మహత్యం ఆయనకు బాగా తెలుసు. సినిమా షూటింగ్‌లో భాగంగా తెరకెక్కించిన పాట సందర్భంలో కొత్త దంపతుల గెటప్‌లో ఉన్న కృష్ణ-విజయనిర్మలను చూసి ఆయన ‘ఈ మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్’ అంటూ జోక్ చేశారు. Also Read: రెండేళ్ల తర్వాత తిరుపతిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కృష్ణ- విజయనిర్మల ఇద్దరికీ ఇది రెండో వివాహం. విజయనిర్మలకు మొదటిభర్తతో కలిగిన సంతానం నరేష్. గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xighHy

నాన్నగారితోనే విజయనిర్మల తొలి చిత్రం: బాలకృష్ణ

సీనియర్ నటి, దిగ్గజ దర్శకురాలు (73) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం అర్ధరాత్రి దాటిన తరవాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు.. విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Also Read: ప్రముఖు నటుడు కూడా విజయనిర్మల మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. తన తండ్రితో విజయనిర్మల చేసిన చిత్రాలను ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. Also Read: ‘నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మల గారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మల గారు ఒకరు. నాన్నగారి "పాండురంగ మహత్యం" సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా. బాల నటి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో "మారిన మనిషి, పెత్తందార్లు, నిండుదంపతులు, విచిత్ర కుటుంబం" సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని బాలయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IQFkbh

ప్రపంచంలో ఆ ఘనత ఒక్క విజయనిర్మలకే సాధ్యం

అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్‌కు గురిచేసింది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. 1946, ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించిన విజయనిర్మల ఏడో ఏటనే తమిళ సినిమా ‘మత్స్యరేఖ’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల ప్రాయంలో ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎన్నో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు పోటీ పడేవి. కేవలం నటిగానే కాకుండా దర్శకత్వం, నిర్మాణ రంగాల్లోనూ విజయనిర్మల రాణించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి వంటి చిత్రాలు తెరకెక్కించారు. దర్శకురాలుగా 44 చిత్రాలను తెరకెక్కించిన ఆమె ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. ప్రపంచంలో ఏ మహిళా దర్శకురాలికి ఈ ఘనత దక్కకపోవడం తెలుగువారు గర్వించదగ్గ విషయం. ఇంతటి ఘనత సాధించిన దిగ్గజ దర్శకురాలు నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IOgmcC

విజయనిర్మల మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు: వైఎస్ జగన్

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RAaNl0

మిస్ యు నన్నీ.. విజయ నిర్మల మృతిపై మంచు మనోజ్ ఉద్వేగం

నటిగా, దర్శకురాలుగా, సూపర్ స్టార్ క్రిష్ణ భార్యగా తెలుగు సినిమా పరిశ్రమకు విశేషసేవలు అందించిన లెజెండరీ యాక్టర్ విజయ నిర్మల మరణంతో టాలీవుడ్‌లో విషాదవదనం నెలకొంది. బుధవారం రాత్రి గుండెనొప్పితో మరణించిన ఆమె మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. Read Also: విజయ నిర్మల కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్న ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. మిస్ యు నన్నీ అంటూ.. మీరు వచ్చారు.. చరిత్ర సృష్టించారు. మీలాంటి నటన ఇంకెవరకీ సాధ్యం కాదు.. మీలాంటి వ్యక్తులు మళ్లీ రారు. ఈరోజు మీరు మమ్మల్ని వదిలివెళ్లడం మాకు తీవ్ర విషాదం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశారు మంచు మనోజ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IOUSfD

విజయనిర్మల మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, ప్రముఖ దర్శకురాలు (73) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స గుండెపోటుతో పొందుతూ మరణించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న విజయనిర్మల మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ‘మిస్ యు నన్నీ అంటూ.. మీరు వచ్చారు.. చరిత్ర సృష్టించారు. మీలాంటి నటన ఇంకెవరకీ సాధ్యం కాదు.. మీలాంటి వ్యక్తులు మళ్లీ రారు. ఈరోజు మీరు మమ్మల్ని వదిలివెళ్లడం మాకు తీవ్ర విషాదం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ - మంచు మనోజ్ విజయనిర్మల గారు చనిపోయారని సడెన్‌గా విన్నాను. విజయనిర్మల మరణం సినీ పరిశ్రమకు, ఆమె కుటుంబానికి తీరని లోటు.- హీరో నితిన్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XdHhrl

విజయనిర్మల కన్నుమూత, టాలీవుడ్‌లో విషాదం

టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏడేళ్లకే బాలనటిగా.. విజయనిర్మల 1950లో ‘మత్య్సరేఖ’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా పరిచమయ్యారు. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు. అక్కడ పలు చిత్రాల్లో నటించి... పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు . అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ‘సాక్షి’ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణతో బంధం.. సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరూ. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XHonsp

చిరంజీవి కోసం ఫ్రెష్ ఫేస్.. కొరటాల వేట!

మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ను పూర్తిచేసేశారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చిరంజీవి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాకు ఇంకా హీరోయిన్‌ను ఫైనల్ చేయలేదు. చిరంజీవి సరసన ఒక కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని కొరటాల శివ చూస్తున్నట్లు సమాచారం. సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. కథతో పాటు దానిలో ఉన్న పాత్రల విషయంలోనూ కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే చిరంజీవి పక్కన చేయబోయే హీరోయిన్ విషయంలో కూడా కొరటాల చాలా జాగ్రత్త తీసుకుంటున్నారని అంటున్నారు. మెగాస్టార్ వయసుకు, ఇమేజ్‌కు సరిపోయే ఒక కొత్త ముఖం కోసం కొరటాల వెతుకుతున్నారట. వాస్తవానికి చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్‌ను తీసుకోవాలని కొరటాల చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఇవేవీ ఆచరణలోకి రాలేదు. కొరటాల కొత్త హీరోయిన్ కోసం చూస్తుండటం వల్లే వీళ్లపై ఆసక్తి చూపలేదని అంటున్నారు. చూద్దాం చిరంజీవి కోసం కొరటాల ఎలాంటి హీరోయిన్‌ను తీసుకొస్తారో! కాగా, ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ILfNAh

‘సైరా’ షూటింగ్‌లో అనుష్కకు గాయం.. సీక్రెట్‌గా డాక్టర్‌ను కలిసిన జేజమ్మ!

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రాయలసీమ పోరాటయోధుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. సినిమాకు కీలకమైన ఒక సన్నివేశంలో అనుష్క నటిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కాలికి గాయమైందట. అయితే, ఈ విషయం బయటికి రాకుండా ‘సైరా’ చిత్ర యూనిట్, అనుష్క జాగ్రత్త పడ్డారని సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా అనుష్క హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం చేయించుకున్నారని, కాలికి ఫ్యాక్చర్ కావడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారని తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగశౌర్య, శర్వానంద్, సందీప్ కిషన్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. అంతేకాదు, వీరి గాయాల కారణంగా షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అనుష్కకు కూడా గాయమంటే ఇది కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోతుందని బహుశా దాచి ఉంచారనుకుంటా! ఏదేమైనా ఈ గాయం నుంచి అనుష్క త్వరగా కోలుకుని మళ్లీ షూటింగుల్లో పాల్గొనాలని కోరుకుందాం. అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా భారీ తారాగణంతో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా వంటి స్టార్లు నటించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా డైలాగులు రాశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Neii2g

బికినీలో 45 ఏళ్ల ముదురు హీరోయిన్.. పిచ్చ హాట్!

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ అందం తరిగిపోతుంది. కానీ, సినీ తారల విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. వాళ్లకు వయసు పెరుగుతన్నకొద్దీ అందం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందం మీద వాళ్లు పెట్టే శ్రద్ధ అలా ఉంటుంది మరి. హేమమాలిని, రేఖ, కాజోల్, మాధురి దీక్షిత్, , టబు, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ వీళ్లంతా ఈ కోవకు చెందినవాళ్లే. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలకు దూరంగా ఉన్న కొంత మంది మాజీ హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా వీరు అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇదిలా ఉంటే, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మంగళవారం (జూన్ 25న) తన 45వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పుట్టినరోజును ఆమె లండన్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. చెల్లెలు కరీనా కపూర్, తల్లి బబితా కపూర్ ఇతర కుటుంబ సభ్యులతో ఆమె లండన్‌లో పార్టీ చేసుకున్నారు. అక్కడ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసుకున్న హాట్ ఫొటోను తాజాగా కరిష్మా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘ఏ వయస్సులో ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. బికినీలో పూల్ దగ్గర రొమాంటిక్ భంగిమలో ఉన్న ఈ ఫొటొలో కరిష్మా పిచ్చ హాట్‌గా ఉన్నారు. 45 ఏళ్ల వయసులోనూ తన అందంతో మతిపోగొడుతున్నారు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ కపూర్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ తదితరులు సైతం కామెంట్లు పెట్టారు. చాలా హాట్‌గా ఉన్నావంటూ కితాబిచ్చారు. కాగా, కరిష్మా కపూర్ 17 ఏళ్ల వయసులోనే నటన మొదలుపెట్టారు. చదువుకు టాటా చెప్పి సినిమాల్లోకి వచ్చేశారు. 1991లో వచ్చిన ‘ప్రేమ్ ఖైదీ’ సినిమాతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేశారు. ఆ తరవాత ‘పోలీస్ ఆఫీసర్’, ‘జాగృతి’, ‘నిశ్చయి’, ‘సాప్నే సజన్ కే’, ‘దీదర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేశారు. దీంతో కరిష్మా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమిర్ ఖాన్‌తో కలిసి చేసిన ‘రాజా హిందుస్థానీ’ చిత్రం కరిష్మాను టాప్ హీరోయిన్‌ను చేసేసింది. షారుఖ్ ఖాన్‌తో ‘దిల్ తో పాగల్ హై’, గోవిందతో ‘హీరో నం.1’, సల్మాన్ ఖాన్‌తో ‘బివి నం.1’ వంటి హిట్ చిత్రాల్లో కరిష్మా నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Yj9rx

జూనియర్ ఎన్టీఆర్ వెరీ నాటీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన కరాటే కళ్యాణి

కరాటే కళ్యాణి.. ఈ పేరు వింటే మనకు బాగా గుర్తొచ్చేది ‘బా..బీ’ అనే డైలాగ్. ఆమె ఎప్పటి నుంచో తెలుగు సినీపరిశ్రమలో నటిగా కొనసాగుతున్నప్పటికీ ‘కృష్ణ’ సినిమాలో పనిమనిషి పాత్ర చాలా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో బ్రహ్మానందం వంటింటి ప్రియురాలిగా ఆమె నటన, యాటిట్యూడ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరవాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆమె టీవీ సీరియళ్లతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, కళ్యాణిని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో కళ్యాణి తన వ్యక్తిగత, సినీ జీవితాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వీటిలో సినీ జీవితానికి సంబంధించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘షూటింగ్ సెట్‌లో నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు కాస్త కోపంగా, దురుసుగా ఉంటారని.. ఎవరైనా తప్పుచేస్తే అరిచేస్తూ ఉంటారని అంటుంటారు. వారిద్దరితో మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రూమర్‌లో నిజమెంత?’ అని కళ్యాణిని యాంకర్ అడిగారు. దీనికి కళ్యాణి సమాధానం ఇస్తూ.. ‘వాస్తవానికి ఎవరికైతే వర్క్ మీద కమాండ్ ఉంటుందో, ఎవరైతే మనం చేస్తున్నది వృత్తి ధర్మం అనుకుంటారో వాళ్లకు ఆ కోపం ఉంటుంది. నాకు కూడా కోపం ఉంటుంది. ఎవరైనా నన్ను విమర్శిస్తే గట్టిగా రియాక్ట్ అవుతాను. సాధారణంగా మనం 10 లేదంటే 20 సెల్ఫీలు ఇవ్వగలం. కానీ, ఒక 100 మంది ఒకేసారి వచ్చి పడిపోతారు. అలాంటప్పుడు ఆగండి అని చిరాకుగా అంటామా లేదా? దాన్ని వీళ్లు పెద్దది చేస్తారు. అక్కడ ముందు జరిగింది ఎవ్వరూ చూపించరు. తరవాత జరిగిన దాన్ని హైలైట్ చేస్తారు’ అని కళ్యాణి వెల్లడించారు. నిజం కన్నా అబద్ధమే తొందరగా పాకుతుందని కళ్యాణి అన్నారు. బాలయ్య, మోహన్ బాబు మంచి వ్యక్తులని ఆమె కొనియాడారు. వాస్తవానికి సెట్‌లో చాలా అల్లరిగా ఉంటారని కళ్యాణి చెప్పారు. ‘ఆది’ సినిమా షూటింగ్‌లో అసిస్టెంట్‌పైకి ఎక్కి పరిగెత్తూ అంటూ గుర్రం ఆట ఆడేవాడని గుర్తుచేశారు. ‘ఎన్టీఆర్ అసిస్టెంట్ చాలా బలంగా ఉండేవాడు. అతని పైకి ఎక్కి గుర్రంలా పరిగెత్తూ అనేవాడు. అసిస్టెంట్ పరిగెత్తి సార్ ఏంటిది అని బాధపడితే అతన్ని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుని ఓదార్చేవాడు. ఇలా చేయడం ఆయనకు చాలా సరదా. సెట్‌లో చిన్నపిల్లాడి చేష్టలన్నీ చేసేవాడు. అప్పటికి ఆయన వయసు కూడా చాలా తక్కువ కదా. చేతికి బ్లడ్ ఉంటే అది అసిస్టెంట్ చొక్కాకి సరదాగా రాసేవాడు. అంత అల్లరి చేసే ఎన్టీఆర్ చేతికి నిజంగా గాయమై చేతి నుంచి రక్తం కారడం నేను కళ్లారా చూశాను’ అని ‘ఆది’ సినిమా షూటింగ్ సమయంలో విషయాలను గుర్తుచేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31TAzFA

Hansika Stills

Hansika

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram



from GALLERY – Tollywood https://ift.tt/2Yd5gTZ

Rajasekhar: పెళ్లికి ముందు ఒకే గదిలో.. మా ఆయనకు వేరే పెళ్లి!: జీవిత రాజశేఖర్

జీవితా రాజశేఖర్.. పేరులోనే కాదు.. నిజ జీవితంలోనూ పక్కన ఉండాలి. జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత అన్నంతగా టాలీవుడ్‌లో ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి వైవాహిక జీవితంలో చాలా ఆసక్తికరపరిణామాలు చోటుచేసుకున్నాయి. సినిమా కథను తలపిస్తూ సాగిన వీరి రిలేషన్, ప్రేమ, పెళ్లిలో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి. అప్పట్లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత.. తన భర్త రాజశేఖర్‌తో అనుబంధం.. ప్రేమ.. పెళ్లిపై ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అవేంటో ఆమె మాటల్లోనే.... హీరో కాబట్టి అమ్మాయిలతో సన్నిహితంగా.. నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు.. ఆయన విషయంలో నేను ఎప్పుడు కరెక్ట్‌గా ఉండేదాన్ని. ముఖ్యంగా నేను చాలా స్ట్రాంగ్ అని నన్ను నేను నమ్ముతా. అందుకే ఆయనకు నా మీద ప్రేమ తగ్గిపోతుందని ఎప్పుడూ అనిపించలేదు. నేను కరెక్ట్‌గా ఉంటే నా నుండి ఎవరూ వెళ్లిపోలేరు. నా పిల్లలు కానివ్వండి నా భర్త కానివ్వండి.. ఫ్రెండ్స్ అయినా.. వాళ్లకు నేను ఒక అవకాశం ఇవ్వనంత వరకూ నన్ను విడిచి ఎలా వెళ్తారు? ఎక్కడైనా ఏ రిలేషన్ షిప్‌లోనైనా తేడా వచ్చింది అంటే.. అవకాశం కల్పించడం వల్లే. మనం ఒకరితో ఒకరు అండర్‌స్టాండింగ్‌గా కాంప్రమైజింగ్‌గా వెళ్లిపోతే గొడవలే ఉండవు. గొడవలు రానంతవరకూ వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోతారనే భయం కూడా ఉండదు. నేను ఇప్పటి వరకూ ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యా.. సక్సెఫుల్‌గానే ఉన్నా. అమ్మాయిలు పిలిచినా నాతో చెప్పేవారు.. రాజశేఖర్ గారితో నాకు బాగా నచ్చేది ఏంటంటే.. ఏది జరిగినా నాతో షేర్ చేసుకుంటారు. అమ్మాయిలు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఎవరున్నా నాతో చెప్పకుండా ఏదీ చేసేవారు కాదు. ఒకవేళ ఒక అమ్మాయి ఫోన్ చేసి నా దగ్గరకు రండి అని అన్నాకూడా ఆయన నాతో చెప్తారు. నిజ జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఒకరోజు ఆయన ఒంగోలులో షూటింగ్‌లో ఉన్నారు. అప్పటికి మాకు పెళ్లి కూడా కాలేదు. మేం ఇద్దరం ఎప్పుడూ అనుకునే వాళ్లం.. ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. కాని పెళ్లికి అందరూ ఒప్పుకోవాలి అనుకున్నాం. ఎవర్ని నొప్పించి పెళ్లి చేసుకోకూడదు అని డిసైట్ అయ్యాం. కాని మేం చాలా బోల్డ్ గానే లిఫ్ట్ చేశాం. మా పెళ్లికి ముందు ‘నవభారతం’ సినిమా టైంలో నటించే టైంలో ఇద్దరం కలిసి ఒకే గదిలో ఉండేవాళ్లం. పక్క పక్క గదులు ఉన్నా సరే మేం.. ఒకే గదిలో ఉండేవాళ్లం. ఇండస్ట్రీలో మాపై అప్పట్లో పెద్ద టాక్.. ఇలా మేం ఇద్దరం కలిసి ఉండటం వల్ల.. ఇండస్ట్రీలో మాపై చాలా చర్చలు జరిగేవి. అయితే పెళ్లి అవుతుందా లేదా? ఇద్దరం పెళ్లి చేసుకోకపోతే నవ్వులపాలైపోతాం అని ఎప్పుడూ అనుకోలేదు. మా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా బాధపడేవాళ్లు. రాజశేఖర్ ఇంటర్వ్యూలలో మా అమ్మ ఎవరు చెప్తే వాళ్లను చేసుకుంటా అని చెబుతున్నాడు.. నువ్వేమో రాజశేఖర్‌తో తిరుగుతున్నావ్ అని మా పేరెంట్స్ బాధపడేవాళ్లు. నేను వాళ్లతో నా నిర్ణయాన్ని చెప్పేశా. రాజశేఖర్ నాకు అంతా ముందే చెప్పారు. నేను ఇంతే.. తను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఇలాగే ఉంటా. మా రిలేషన్ షిప్ ఇలాగే ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ ఆయన జీవితంలోకి వేరే అమ్మాయి వచ్చి తను యాక్సెప్ట్ చేయకపోతే మేం గుడ్ ఫ్రెండ్స్‌గా ఉండిపోతాం. అది ఆయన ఇష్టం ఆవిడకు ఏం చెప్తారన్నది ఆయన నిర్ణయం. ఇద్దరం ఇలాగే డిసైడ్ అయ్యాం. ఆయనకే వేరే అమ్మాయితో పెళ్లి దాదాపు ఖాయమైంది.. కాని అనుకున్నట్టుగానే రాజశేఖర్ గారికి వేరే అమ్మాయితో పెళ్లి దాదాపు ఖాయమైంది. రెండు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఆమె కాని హీరోయిన్ కాదు.. పేరు చెప్పను కాని పెళ్లి మాత్రం ఆవిడతో సెట్ అయ్యింది. అంతా ఓకే అనుకున్నారు.. రాజశేఖర్ పూర్తి సంతోషంతో లేరు కాని వాళ్ల ఫ్యామిలీ నిర్ణయాన్ని కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నారు. వాళ్ల బ్రదర్ ఇన్ లా వచ్చి నాతో మాట్లాడారు. నేకు పెయిన్‌గా ఉన్నా.. రాజశేఖర్ పెళ్లికి ఒప్పుకున్నాను. ఆ అమ్మాయి నా సీనియర్.. రాజశేఖర్‌తో పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి నాతోనే చదువుకుంది. ఆమె నా సీనియర్. ఆమె పేరు చెప్పకూడదు. అయితే ఒకరోజు ఆమె నన్ను కలవాలంటుందని నాతో చెప్పారు. ముగ్గురం కలిసి ఓ గుడికి వెళ్లాం. ఎప్పుడూ నేను ఆయన కారులో ఆయన పక్కన కూర్చునే దాన్ని. ఆరోజు నేను వెనుక కూర్చున్నా. ఆ అమ్మాయి ఆయన పక్కన కూర్చుంది. ఇద్దరం బాగానే మాట్లాడుకుని ఎవరి ఇంటికి వాళ్లు వెళిపోయాం. ఆ తరువాత ఈ ఆలోచనలతో నాకు హెల్త్ పాడైంది. ఆ తరవాత రాజశేఖర్‌తో వరుస సినిమాలు చేసేవాళ్లం. ఆమె పెట్టిక కండిషన్‌కి రాజశేఖర్ ఒప్పుకోలేదు.. తరువాత ఏమైందో ఏమో కాని.. ఆమెకు రాజశేఖర్‌తో నా రిలేషన్ నచ్చలేదు. ఒకరోజు రాజశేఖర్ గారితో జీవితతో రిలేషన్ వదిలేసి.. ఆమెతో సినిమాలు చేయకుండా ఉంటే పెళ్లి చేసుకుందాం అనే కండిషన్ పెట్టింది ఆ అమ్మాయి. వాళ్ల పేరెంట్స్ కూడా అదే అభిప్రాయం చెప్పారు. అప్పుడు రాజశేఖర్ గారు.. అది ఇంపాజిబుల్. నా లైఫ్‌ని మీరు డిక్టేట్ చేయొద్దు. ఒక భార్యగా నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇస్తా.. కాని జీవిత మాట్లాడొద్దు అనడం కరెక్ట్ కాదని ఆయన చెప్పేశారు. నేను చేసింది రైటా రాంగా అని రాజశేఖర్ గారు నన్ను అడిగారు. దానికి ఆన్సర్ చెప్పే సరిస్థితుల్లో నేను లేన్నా. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని చెప్పా. ఆ తరువాత చాలా జరిగింది. పెళ్లి క్యాన్సిల్ చేసి ఆమెను అమెరికాకు పంపేశారు. వాస్తవానికి ఆమె రాజశేఖర్‌ని చాలా ఇష్టపడి హై లెవల్‌లో మ్యారేజ్‌ కోసం ప్లాన్ చేశారు కాని కుదర్లేదు. మా ప్రేమకథ మలుపు తిరిగింది ఇక్కడే.. పెళ్లి క్యాన్సిల్ అయిన తరువాత రాజశేఖర్‌తో కలిసి రెండు మూడు ఫిల్మ్స్‌లో నటించా. అయితే మగాడు మూవీ టైంలో ఆయనకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. నెలన్నర పాటు ఆయన హాస్పటల్‌లోనే ఉన్నారు. ఆయనతో పాటు నేను హాస్పటల్‌లోనే ఉన్నా. ఆ తరువాత వాళ్ల పేరెంట్స్ మనసు మార్చుకుని డైరెక్ట్‌గా హాస్పటల్‌ను వాళ్ల ఇంటికే తీసుకువెళ్లారు. వెంటనే పెళ్లి చేద్దాం అనుకున్నారు. కాని ఆయన కోలుకోవడానికి ఏడాది పట్టింది. అప్పుడు నేను ఆయన ఇంట్లోనే ఉన్నాం. ఆయన కోలుకున్న తరువాత పెళ్లి అనుకునే లోపు మా నాన్న గారు చనిపోవడంతో ఏడాది ఆగి ఆ తరువాత పెళ్లి చేసుకున్నాం’ అంటూ సినిమా కథను తలపించే ‘జీవిత-రాజశేఖర్’ ప్రేమకథను చెప్పుకొచ్చారు జీవిత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2J5JECE

‘కల్కి’ కథ వివాదం.. కార్తికేయ కోర్టు మెట్లు ఎక్కుతారా?

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘కల్కి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 28న ‘కల్కి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. విడుదల తేదీ దగ్గరవుతున్న తరుణంలో ఈ సినిమా కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ‘కల్కి’ కథ తనదేనంటూ రచయిత కార్తికేయ అలియాస్ ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన తెలుగు సినీ రైటర్స్ అసోయేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ‘కల్కి’ ట్రైలర్ చూసినప్పుడు తాను షాక్‌కు గురయ్యానని, తాను రాసుకున్న కథతోనే సినిమా తీశారని కార్తికేయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009లోనే రిజిస్టర్ చేసుకున్నానని స్క్రిప్టును కూడా అందజేశారు. ఈ వివాదంలో రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మధ్యవర్తిత్వం చేశారు. విషయాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి, ఇలాంటి కాపీరైట్ వివాదాలు ఇండస్ట్రీలో ఎక్కువైపోవడంతో వాటిని పరిష్కరించడానికి ‘కథా హక్కుల వేదిక’ను బీవీఎస్ రవి ఏడాది క్రితం ప్రారంభించారు. విషయం కోర్టుల వరకు వెళ్లకుండా ఇక్కడే పరిష్కారం కావడానికి రవి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ‘కల్కి’ కాపీరైట్ వివాదాన్ని పరిష్కరించారు. Read Also: ‘కల్కి’ కాపీరైట్ వివాదం గురించి బీవీఎస్ రవి ఇటీవల డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ.. ‘కార్తికేయ మాకు ఇచ్చిన స్క్రిప్ట్.. ‘కల్కి’ కథ వేరుగా ఉన్నాయి. ఎక్కడా రెండింటికి పోలిక లేదు. ఈ విషయంలో మేం మధ్యవర్తిత్వం వహించి వివరణ ఇచ్చినా ఆయన సంతృప్తిగా లేరు. దీనిపై ఇంకా చర్చలు జరపాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు స్క్రిప్టలలో పోలిక ఉంటే, కార్తికేయకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆయనకు పారితోషికం కూడా చెల్లించాల్సి ఉంటుంది’ అని చెప్పారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్, సెక్రటరీ రామ్ ప్రసాద్ సహాయ సహకారాలు అందిస్తారని రవి వెల్లడించారు. కాగా, ఈ వివాదంలో తుది నిర్ణయం తీసేసుకున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ కథ, ‘కల్కి’ స్క్రిప్ట్‌లకు పోలిక లేదని స్పష్టం చేశారట. కథా హక్కుల వేదిక నిర్ణయంపై కార్తికేయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము తీసుకున్న నిర్ణయంతో సంతృప్తి చెందని పక్షంలో కోర్టుకు వెళ్లొచ్చని బీవీఎస్ రవి సూచించారట. కాబట్టి, కార్తికేయ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున కార్తికేయ కోర్టుకు వెళ్లడం కష్టమేనన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆయనలో అంత కాన్ఫిడెన్స్ లేదని సమాచారం. చూద్దాం.. ఆయన కోర్టుకెళ్తారో వెనక్కి తగ్గుతారో!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RyN4Bs

Kalki Honest Trailer: కొల్లాపూర్ ఎమ్మెల్యే తమ్ముడి హత్య.. ఇదే ‘కల్కి’ కథాంశం

హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కల్కి’పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ‘పీఎస్‌వీ గరుడవేగ’తో రాజశేఖర్ మళ్లీ ఫాంలోకి రావడంతో ‘కల్కి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీనికితోడు ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల్లోని ఆసక్తిని మరించి పెంచేందుకు తాజాగా ‘హానెస్ట్ ట్రైలర్’ పేరిట చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి ఈ ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే, డిజిటల్ వర్షన్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు కేవలం యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల్లో ఇంటెన్సిటీని పెంచిన దర్శకుడు ఈ కొత్త థియేట్రికల్ ట్రైలర్‌లో అసలు స్టోరీ లైన్ ఏంటో రిలీల్ చేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నట్టు ఇప్పటికే దర్శకుడు చెప్పారు. ట్రైలర్ ప్రారంభంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు, ఆ క్రమంలో ఎదురైన సమస్యల ఆధారంగా ఒక అదిరిపోయే థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా, ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌‌లో అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించారు. పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామక్రిష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ, శత్రు, చరణ్‌దీప్ ముఖ్య పాత్రలు పోషించారు. శివాని-శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2LdqNs0

జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఏం చేయలేడు.. పోసాని సంచలన వ్యాఖ్యలు

పోసాని కృష్ణమురళి.. ఈ పేరులోనే ఒక ఫైర్ ఉంది. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఆయనకు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. లోపల ఏమనుకుంటే అది బయటకు వచ్చేస్తుంది. ముక్కుసూటిగా అస్సలు మొహమాటం పడకుండా మాట్లాడే ఇండస్ట్రీకి చెందిన చాలా తక్కువ మందిలో పోసాని ఒకరు. అందుకే ఆయన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది ద్వేషిస్తుంటారు. ప్రస్తుతానికి అయితే టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పోసాని అంటే మండిపడుతున్నారు. కారణం నోటి వెంట జగన్ తప్ప మరో మాట రాకపోవడం. తెలుగు సినీ పరిశ్రమలోకి రచయితగా అడుగుపెట్టిన పోసాని సుమారు 100 సినిమాలకు పనిచేశారు. ఆ తరవాత దర్శకుడిగా మారి తన మార్క్ చూపించారు. ప్రస్తుతం నటుడిగా సెటిలయ్యారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వై.యస్.జగన్‌మోహన్ రెడ్డి ఫాలోవర్‌గా వైసీపీలో చేరారు. జగన్‌ను సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని చాలా సార్లు చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్‌ కోసం ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇదిలా ఉంటే, జగన్ సీఎం కావడం పట్ల పోసాని చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. శస్త్ర చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోసానిని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ‘టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మీ స్పందనేంటి?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు పోసాని స్పందిస్తూ జూనియర్ ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేయలేడని అన్నారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఎంత నీతిగా, చిత్తశుద్ధితో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా బండి నడవదు. ఒక హీరో వచ్చి ఐ కెన్ బ్రింగ్ స్టార్ ఫ్రమ్ ద స్కై అంటే నమ్మే రోజులు లేవు ఇప్పుడు. బీ ప్రాక్టికల్. హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది. తెలివితేటలు పెరగవు. ప్రజాసేవా దృక్పథం పెరగదు. హీరో ఇమేజ్‌కి, రాజకీయాలకు సంబంధంలేదు. ఇమేజ్‌తో చూడటానికి నాకు వంద మంది వస్తే వాళ్లకు 10వేల మంది వస్తారు. ఈ 10వేల మంది ఓటర్లుగా మారరు. హీరోని తెరపై చూశాం.. రియల్‌గా చూశాం.. ఎలా ఉన్నాడు అని మాత్రమే మాట్లాడుకుంటారు’ అని పోసాని వ్యాఖ్యానించారు. టీడీపీ, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాల్లో తనకు అవకాశాలు తగ్గాయని.. కావాలనే తనను కొంత మంది తప్పిస్తున్నారని కూడా పోసాని చెప్పారు. ‘ఇండస్ట్రీలో ఎక్కువ మంది టీడీపీ వాళ్లు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది చంద్రబాబు ఫ్యాన్స్ ఉన్నారో.. ఎంత మంది టీడీపీని ఇష్టపడతారో మీకు తెలుసు. ఎందుకు ఇష్టపడతారో కూడా మీకు తెలుసు. అది కులమా, ఇంకో కారణం ఉందా అని నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని పోసాని అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడటం మీ సినిమా అవకాశాలపై ప్రభావం చూపిందా? అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ.. ‘ఎలక్షన్ దగ్గరకు రాగానే మా వాళ్లకు నా మీద కోపమొచ్చింది. దీంతో నాకు వేషాలు తగ్గాయి. లేకుండా చేశారు. నాకు జబ్బు రాకముందు కూడా తగ్గాయి. నేనంటే వ్యక్తిగతంగా ప్రేమించే వాళ్లు అవకాశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని తిట్టాడు, చంద్రబాబును తిడుతున్నాడు వాడి వేషం తీసేయ్ అని రాసిన పేరును కూడా కొట్టేసి వేరే వాళ్లను పెట్టారు. పేర్లు చెప్పమంటారా.. మా అశ్వినీదత్తన్న’ అని బాంబు పేల్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WX1JaN

Varun Tej Valmiki Movie Pre Teaser



from TOPSTORIES – Tollywood http://bit.ly/2ZEVie8

Varun Tej Valmiki Movie Pre Teaser



from VIDEOS – Tollywood http://bit.ly/2ZEVie8

ఊర్వశీ పరదేశి

ఊర్వశీ పరదేశి

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery http://bit.ly/2IBoCfY

‘తలచినదే జరిగినదా’ మూవీ ఓపెనింగ్

‘తలచినదే జరిగినదా’ మూవీ ఓపెనింగ్

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery http://bit.ly/2Y8Vr9F

ఆది ‘బుర్రకథ’ ట్రైలర్.. అప్పుడే ‘సాహో’ని వాడేశారు!

హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బుర్రకథ’. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవీ కిరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆది సరసన మిష్తి చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అభిమన్యు సింగ్, జబర్దస్త్ మహేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, గాయత్రి గుప్తా, జోష్ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్‌ను లాంచ్ చేయించారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘బుర్రకథ’.. టైటిల్‌లోనే సినిమాకు కీలకమైన పాయింట్ దాగి ఉంది. హీరో ఆది ఈ సినిమాలు రెండు విధాలుగా ప్రవర్తిస్తాడు. భౌతికంగా మనిషి ఒక్కడే అయినప్పటికీ అంతర్గతంగా ఆయనలో ఇద్దరు మనుషులుంటారు. అంటే, ఆయన మెదడు రెండు విధాలుగా పనిచేస్తుంది. అందుకే ఇది ‘బుర్రకథ’ అయింది. మరి ఈ ‘బుర్ర’తో డైరెక్టర్ ఎలాంటి ప్రయోగం చేశారో ఇక సినిమాలోనే చూడాలి. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆది తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక కమెడియన్ పృథ్వీ మరోసారి పేరడీ చేశారు. గతంలో బాలయ్యను అనుకరించిన పృథ్వీ.. ఈసారి ప్రభాస్, ఎన్టీఆర్‌లను వాడేశారు. ‘సాహో’ ట్రైలర్‌లో ప్రభాస్ చెప్పిన ‘ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్’ డైలాగ్‌ను ‘బుర్రకథ’ ట్రైలర్ ఆఖరిలో పృథ్వీ చెప్పారు. అలాగే ‘అరవింద సమేత’లో బాలిరెడ్డిని చూసి కోపంగా మొండికత్తిని వీరరాఘవ తన తొడకు అటూ ఇటూ రాస్తారు. అదే సీన్‌ను పృథ్వీ ఇప్పుడు అనుకరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Fu1FJH

‘బుర్రకథ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌‌‌

‘బుర్రకథ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌‌‌

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery http://bit.ly/2IERggp

సాయిధరమ్‌కు ఇక ‘ప్రతిరోజూ పండగే’!

సుప్రీం హీరో కొత్త సినిమాను మొదలుపెట్టారు. కామెడీ, కమర్షియల్ హంగులతో కూడిన చిత్రాలను తెరకెక్కించే మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమాను తేజూ ప్రారంభించారు. సాయిధరమ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా పూజాకార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా స్క్రిప్టును చిత్ర యూనిట్‌కు అందజేశారు. దర్శకుడు మారుతితో తన కొత్త సినిమాను ప్రారంభించినట్లు సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రేక్షకుల ఆశీర్వాదాలు తనకు కావాలని కోరుకున్నారు. ఇది తేజూకి 12వ సినిమా. వరుస ప్లాపుల తరవాత ఈ ఏడాది ఏప్రిల్‌ 12న వచ్చిన ‘చిత్రలహరి’ సినిమా తేజూకి కాస్త ఊరటనిచ్చింది. ‘చిత్రలహరి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చినా బాక్సాఫీసు వద్ద మాత్రం పెద్దగా కలెక్షన్లను రాబట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తేజూ ఆశలన్నీ ‘ప్రతిరోజూ పండగే’ పైనే ఉన్నాయి. మారుతి కూడా ఈ మధ్య కాలంలో హిట్టు అందుకోలేదు. ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మారుతి స్క్రిప్ట్ అందించిన ‘బ్రాండ్ బాబు’ సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇప్పుడు తేజూతో మారుతి ప్రయోగం చేయబోతున్నారు. అయితే, జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఈ మధ్య అన్నీ హిట్టు సినిమాలే వచ్చాయి. ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలు మంచి విజయాలను నమోదుచేశాయి. కాబట్టి, సాయిధరమ్ తేజ్ ఈసారి హిట్టు కొట్టడం ఖాయంలానే కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IDqHbx

‘రంగ్ దే!’.. అభిమానులకు నితిన్ సర్‌ప్రైజ్

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తరవాత కాస్త ఎక్కువగానే విరామం తీసుకున్న హీరో ఇప్పుడు వరసపెట్టి సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వెంకీ కుడుములతో ‘భీష్మ’ చిత్రంతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించిన నితిన్.. తాజాగా మరో సినిమాను ప్రకటించారు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తు్న్నారు. ఈ సినిమాకు ‘రంగ్ దే!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ‘రంగ్ దే!’ నితిన్‌కు 29వ సినిమా. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాను ప్రకటించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది నితిన్ ప్రకటించిన మూడో సినిమా ఇది. వాస్తవానికి ఆదివారమే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంతో తన 28వ సినిమాను నితిన్ ప్రారంభించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమాను ప్రకటించి 24 గంటలు కాకముందే మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులకు నితిన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘భీష్మ’ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరవాత బహుశా ‘రంగ్ దే!’ రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చు. కాగా, ఈ సినిమాకు సంగీతం దర్శకుడిని ఇంకా ఖరారు చేయలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2ZJlZP8

‘జైసేన’ మూవీ ఫన్ట్‌ సాంగ్‌ లాంచ్

‘జైసేన’ మూవీ ఫన్ట్‌ సాంగ్‌ లాంచ్

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery http://bit.ly/2RuoGRD

ఆదిని చుట్టుముట్టేసిన అమ్మాయిల.. నాక్ నాక్ నాకొద్దు!

డైలాగ్ కింగ్, నటుడు సాయికుమార్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయన తనయుడు ఆది హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతుంది. కానీ, ఆయన మార్కెట్‌ను క్రియేట్ చేయలేకపోతున్నారు. నటుడిగా మంచి గుర్తింపు వచ్చినా హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నారు. వరసపెట్టి సినిమాలు చేసుకొచ్చినా అవన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో విఫలమయ్యాయి. దీంతో కథల ఎంపికలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ‘బుర్రకథ’ అనే స్క్రిప్టును అంగీకరించారు. కిందటేడాది ఆగస్టులో ఈ సినిమా ప్రారంభమైంది. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆది సరసన మిష్తి చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అభిమన్యు సింగ్, జబర్దస్త్ మహేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, గాయత్రి గుప్తా, జోష్ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలోని తొలిపాటను తాజాగా విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ఒక డీజే సాంగ్‌ను ఈ పాట తలపిస్తోంది. ‘నాక్ నాక్ నాకొద్దు’ అంటూ సాగే ఈ పాటను డైమండ్ రత్నబాబు రచించారు. సాయి కార్తీక్, కావ్య ఆలపించారు. ఈ పాటలో కొంత మంది అమ్మాయిలు కలిసి ఆదిని టీజ్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాళ్లు అడిగే రొమాంటిక్ కోరికలను ఆది ‘నాక్ నాక్ నాకొద్దు’ అంటున్నారు. పాట అంత గొప్పగా ఏమీ లేకపోయినా యూత్‌ను ఆకట్టుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IBNrZg

Raashi Khanna Stills

Raashi Khanna

Source: Instagram

Source: Instagram

Source: Instagram

Source: Instagram



from GALLERY – Tollywood http://bit.ly/2WZYejY

Pawan Kalyan New Look Shocking Everyone



from VIDEOS – Tollywood http://bit.ly/2KxfdIx

క్రియేటివ్ డైరెక్టర్‌తో నితిన్ కొత్త సినిమా.. ఇద్దరు భామలతో రొమాన్స్

హీరో మరో సినిమాను పట్టాలెక్కించారు. వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నారు. ఇది నితిన్‌కు 28వ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. పూజా కార్యక్రమంలో హీరో నితిన్, హీరోయిన్ ప్రియా వారియర్, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, నిర్మాత ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. చంద్రశేఖర్ ఏలేటితో సినిమా చేస్తుండటం పట్ల నితిన్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సినిమా ప్రారంభమైందని ట్వీట్ చేశారు. ‘నితిన్ 28 ముహూర్తం అయిపోయింది. ఏలేటి చంద్రశేఖర్ గారితో పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది!! మొత్తం మీద రకుల్‌ నేను కలిసి పనిచేస్తున్నాం. ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్‌గా చేస్తోంది. భవ్య ఆనంద్ ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు’ అని తన ట్వీట్‌లో నితిన్ పేర్కొన్నారు. కాగా, ‘ఐతే’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన చంద్రశేఖర్ ఏలేటి తొలి చిత్రానికే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరవాత ఆయన చేసిన సినిమాలన్నీ వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్నవే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుడు సీటుకు అతుక్కుపోయేలా చేయడంలో చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తులు. ఆయన చేసినవి కేవలం ఆరు సినిమాలే అయినా తెలుగులో ప్రతిభ కలిగిన, సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా చంద్రశేఖర్ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకునే చంద్రశేఖర్ మూడేళ్ల విరామం తరవాత ఇప్పుడు నితిన్‌తో సినిమాను ప్రారంభించారు. మరోవైపు, నితిన్ కూడా ఈ మధ్య కాస్త డీలాపడ్డారు. ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ తేడా కొట్టడంతో ఈ ఏడాది ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘భీష్మ’ సినిమాను మొదలుపెట్టారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాను నితిన్ పట్టాలెక్కించేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Ky6aHw

Izabelle Leite వైరల్ పిక్: విజయ్ దేవరకొండతో బ్రెజిల్ సుందరి ‘బ్రేకప్’

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో విజయ్ దేవరకొండపై ఉన్న అభిమానం ఖండాంతరాలు దాటింది. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానగనం ఉన్నారు. అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీతా గోవిందం చిత్రాలు తెచ్చిన క్రేజ్‌తో చిత్రాలు ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలౌతున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు రెడీ కాగా.. మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టేశారు. ఇందులో క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండని విఫల ప్రేమికుడిగా కనిపించబోతున్నారట దర్శకుడు క్రాంతి మాధవ్. ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్స్‌ని తీసుకున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్‌లతో పాటు.. బ్రెజిల్ సుందరి ఇజాబెల్లె లైట్ హీరోయిన్స్‌ తీసుకున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లో విజయ్ దేవరకొండతో ఇజాబెల్లె లైట్ దిగిన క్యూట్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరూ నాలుకలు అడ్డంగా కొరికి.. చాలా క్లోజ్‌గా నవ్వుతూ ఉండగా సెల్ఫీకి క్లిక్‌ మనిపించారు. నేను చాలా లక్కీ.. ఈ రౌడీ నా కో స్టార్ అంటూ ఈ క్యూట్ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఇజాబెల్లె లైట్. ప్రస్తుతం ఈ క్లోజ్ అండ్ క్యూట్ సెల్ఫీని విజయదేవరకొండ ఫ్యాన్స్ షేర్‌లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఉంగరాల రాంబాబు’, ‘ఓనమాలు’ వంటి మంచి సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్.. ఈ సినిమాలో విజయ్‌ చాలా డిఫరెంట్‌గా చూపించబోతున్నారట. విఫల ప్రేమికుడిగా ప్రేమించిన ప్రతి అమ్మాయితో విజయ్‌కు బ్రేకప్ అయిపోతుందని సమాచారం. అందుకే, దీనికి ‘బ్రేకప్’ అనే టైటల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇజాబెల్లె లైట్ ముగ్గురితో విజయ్‌కు బ్రేకప్ అయిపోతుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇజాబెల్లె లైట్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ పిక్స్..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2N4YaQn

Kobbari Matta Movie Shambho Siva Shambho Video Song



from TOPSTORIES – Tollywood http://bit.ly/2ZCINzN

Harish Rao: కాళేశ్వరంపై మహేష్ ట్వీట్.. హరీష్‌రావు ఫ్యాన్స్ ఆగ్రహం

ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ ‘కాళేశ్వరం’ శుక్రవారం నాడు లాంఛనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పట్టుదల ఉంటే దశాబ్దాలు కాదు. సంవత్సరాలోనే ఎంత పెద్ద ప్రాజెక్టు నైనా నిర్మించవచ్చని దేశానికే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక సంకేతాన్ని అందించడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌ను నిర్మించిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోండగా.. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున, రవితేజలు ఇదొక ఇంజినీరింగ్ అద్భుతమంటూ తెలంగాణ సీఎంను, కేటీఆర్‌ను పొగుడుతూ ట్వీట్లు చేయగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ సైతం ఇదే తరహాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ట్వీట్ చేశారు. అయితే నాగార్జున, రవితేజలు కేసీఆర్, కేటీఆర్‌లను ప్రస్తావించి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో శ్రమించిన నాటి ఇరిగేషన్ శాఖా మంత్రి హరీష్‌ రావును ప్రస్తావించకపోవడం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. తాజాగా మహేష్ బాబు సైతం హరీష్ రావు పేరును ప్రస్తావించకపోవడంతో.. ‘మేం చాలా నిరుత్సాహంగా ఉన్నాం అన్నా.. ‘హరీష్.. ఎక్కడ?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే ‘మీరు కంగ్రాట్స్ చెప్పాల్సింది కేటీఆర్‌కి కాదు.. హరీష్ రావుకి.. ఆయన కోసం ఎంతో చేశారు. ఆయన్ని ఎందుకు ట్యాగ్ చేయలేదు’ అంటూ ప్రశ్నిస్తున్నారు. సుర్రున కాలే ఇసుకతిన్నెల్లో.. 44 డిగ్రీల ఎండ వేడిమిలో అపర భగీరథుడిగా.. పట్టు వదలని విక్రమార్కుడిలా.. శ్రామికుడిగా.. సైనికుడిగా నాటి నీటి పారుదల మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలుసార్లు సందర్శించి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో త్వరితగతిన ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అతిథులుగా పాల్గొన్నారు. అయితే తొలి నుండి ఈ ప్రాజెక్ట్‌ కోసం అహర్నిశలు శ్రమించిన హరీష్ రావు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండి.. సిద్ధపేటకు పరిమితం అయ్యారు. అక్కడ చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామ పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాంతంలో ప్రారంభోత్సవ సంబరాలను నిర్వహించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/31L8ikq

ట్రాఫిక్‌లో చిక్కుకున్న హీరో నితిన్... మెట్రో రైలులో గమ్యస్థానానికి

హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. సామ్యానులతో పాటు సెలబ్రెటీలకు కూడా ట్రాఫిక్ జామ్ సెగ తగిలింది. శుక్రవారం ఓ పని నిమిత్తం బయటకు వచ్చిన టాలీవుడ్ కూడా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. దీంతో ఆయన కారు దిగి మెట్రో రైలెక్కి గమ్య స్థానానికి చేరుకున్నారు. కిక్కిరిసిన కోచ్‌లో ఎక్కిన నితిన్‌తో సెల్ఫీలు దిగేందుకు, షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు మెట్రో ప్రయాణికులు పోటీ పడ్డారు. నితిన్ సైతం వారితో నవ్వుతూ మాట్లాడుతూ సందడి చేశారు. తాను దిగాల్సిన స్టేషన్ వచ్చాక అందరికీ బాయ్ చెబుతూ ఆయన వెళ్లిపోయారు. మెట్రో స్టేషన్లో తీసుకున్న ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేసిన నితిన్.. రోడ్లు చాలా రద్దీగా ఉన్నాయని, ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు మెట్రో ఎక్కానని. ఈ ప్రయాణం అద్భుతంగా సాగింటూ’ ట్వీట్ చేస్తూ ఫోటోలు జత చేశారు. శుక్రవారం కురిసిన వర్షానికి మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ప్రజలు, ఉద్యోగులు మెట్రో రైల్ ఎక్కేందుకు ఆసక్తి చూపడంతో స్టేషన్లతో పాటు రైళ్లు నిండిపోయాయి. ముఖ్యంగా హైటెక్‌ సిటీ నుంచి అమీర్‌పేట వరకు ఉన్న మెట్రో మార్గంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. హైటెక్‌సిటీ నుంచి అమీర్‌పేట మెట్రో మార్గంలో ఊహించనంత రద్దీ కనిపించిందని, ఓ టైమ్‌లో ప్రయాణికులను నియంత్రించలేని పరిస్థితి నెలకొందని మెట్రో అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం తరుచూ ఇలాంటి పరిస్థితి తలెత్తే పరిస్థితి ఉండటంతో దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2RqxasS

‘మల్లేశం’ మూవీ రివ్యూ

ఇలాంటి బతుకు సిత్రాలను చూపించే చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఓ సాధారణ మామూలు జీవితాన్నే తన కథకు స్క్రీన్ ప్లేగా మలిచి మ్యాజిక్ చేశాడు దర్శకుడు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2ZFFrfz

Mehreen Kaur Pirzada Stills

Mehreen Kaur Pirzada



from GALLERY – Tollywood http://bit.ly/2XvfgKW